AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: మళ్లీ రాజమౌళితో ఎన్టీఆర్! మూవీ లెజెండ్ బయోపిక్‌కు సన్నాహాలు.. ఫ్యాన్స్‌కు పండగే

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'వార్ 2' తో పాటు ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉంటున్నాడు. అలాగే 'దేవర 2' కూడా పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో నటించనున్నారని ప్రచారం జరుగుతోంది. అది కూడా రాజమౌళి మార్గదర్శకత్వంలో..

Jr NTR: మళ్లీ రాజమౌళితో ఎన్టీఆర్! మూవీ లెజెండ్ బయోపిక్‌కు సన్నాహాలు.. ఫ్యాన్స్‌కు పండగే
Jr NTR
Basha Shek
|

Updated on: May 15, 2025 | 2:08 PM

Share

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో ఓ సినిమాతో బిజి బిజీగా ఉంటున్నాడు. అంతకంటే ముందు తారక్ నటించిన ‘వార్ 2’ ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. దీంతో పాటు దేవర 2 కూడా ఎన్టీఆర్ పూర్తి చేయాల్సి ఉంది. అయితే ఇంతలోనే తారక్ మరో కొత్త సినిమాకు పచ్చజెండా ఊపాడని ప్రచారం జరుగుతోంది. అది కూడా ది గ్రేట్ లెజెండ్, ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా దాదాసాహెబ్ ఫాల్కే లో తారక్ నటిస్తున్నాడని తెగ రూమర్లు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే ఇదొక పవర్ ఫుల్ బయోపిక్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే భారత దేశంలో సినిమా పుట్టుకకు దాదాసాహెబ్ ఫాల్కేనే కారణం. ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, ఆయన కుమారుడు కార్తికేయ, మాక్స్ స్టూడియో వరుణ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మించడానికి సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ ప్రాజెక్టు గురించి రాజమౌళి ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ తో చర్చలు జరిపాడని టాక్. ఎన్టీఆర్ కూడా ఇందులో నటించడానికి ఆసక్తి చూపించాడని సమాచారం.

దాదాసాహెబ్ ఫాల్కే జీవితాన్ని తెరపైకి తీసుకురావడం అంత తేలికైన పని కాదు. ఇందులో అనేక సవాళ్లు ఉన్నాయి. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ ఎక్కువగా మాస్ చిత్రాల ద్వారా అందరి దృష్టిని ఆకర్షించాడు. మరి ఇప్పుడు దాదా సాహెబ్ పాల్కే లాంటి పాత్రలో ఎన్టీఆర్ ను అభిమానులు చూస్తారా? లేదా? అన్నది ప్రశ్నార్థకంగా మారింది. కాగా ఈ బయోపిక్‌ నిర్మించేందుకు ‘మేడ్ ఇన్ ఇండియా’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేశారని సమాచారం. దీనికి నితిన్‌ కక్కర్‌ దర్శకత్వం వహిస్తారని తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

దాదాసాహెబ్ ఫాల్కే 1870లో జన్మించారు. ఆయన మొదటి పేరు దుండిరాజ్ గోవింద ఫాల్కే. 1903లో, ఆయన పురావస్తు శాఖలో ఫోటోగ్రాఫర్‌గా చేరారు. 1910లో ‘లైఫ్ ఆఫ్ క్రైస్ట్’ అనే సినిమా చూసిన తర్వాత ఆయన సినిమా తీయాలని నిర్ణయించుకున్నారు. అలా 1913లో, ఆయన ‘రాజా హరిశ్చంద్ర’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది భారతదేశంలో విడుదలైన మొట్టమొదటి పూర్తి నిడివి సినిమా. ఆ తర్వాత ఆయన 95 సినిమాలు తీశారు. తన మొదటి సినిమా తీయడానికి తన ఆస్తినంతా అమ్మేశారు దాదా సాహెబ్. భారతీయ సినిమా పరిశ్రమ ఉన్నంతవరకు దాదా సాహెబ్ పాల్కే పేరు వినిపిస్తుంటుంది. భారత ప్రభుత్వం కూడా ఆయన పేరు మీద ఏటా అవార్డులు అందజేస్తోంది.

వైరల్ అవుతోన్న ఎన్టీఆర్ లుక్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
నాగిని పాటకు.. దుమ్మురేపే డ్యాన్స్ వేసిన పాము.. వీడియో వైరల్..
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
స్టార్ డైరెక్టర్ అయ్యే ప్రయత్నంలో మృత్యు ఒడికి
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
అందాల నాట్య మయూరి.. ఈ స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా.. ?
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
కడుపునొప్పి వచ్చిందని ఇంజెక్షన్ ఇచ్చిన ఆర్ఎంపీ.. కట్ చేస్తే..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
ఇదెక్కడి ట్విస్ట్ భయ్యా.. బిగ్‏బాస్ ఓటింగ్ దెబ్బకు గల్లంతు..
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
పట్ట పగలు నడి రోడ్డుపై దారుణ హత్య.. బైక్ తగిలిందని గ్యాంగ్‌వార్‌!
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
సెలబ్రెటీల అడ్డాలో ఏకంగా రూ. 10 కోట్లతో పృథ్వీ షా డ్రీమ్ హౌస్
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
హైదరాబాద్‌కు దగ్గర్లో స్వర్గాన్ని తలపించే 100 డెస్టినేషన్లు..
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
మరో 2 రోజుల్లో శ్రేష్ఠ 2026 రాత పరీక్ష.. అడ్మిట్‌ కార్డుల లింక్‌
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్
శ్రీలంకలో రష్మిక బ్యాచిలరేట్ పార్టీ.. ఫొటోస్ వైరల్