Tollywood: ఈ అమాయకపు చూపుల బుజ్జాయి ఇప్పుడు ఆ స్టార్ హీరో సతీమణి.. తెలుగులో ఒక్క సినిమానే చేసింది.. ఎవరో గుర్తుపట్టండి.

|

Nov 08, 2022 | 12:24 PM

పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో గుర్తుపట్టండి. తన భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు.

Tollywood: ఈ అమాయకపు చూపుల బుజ్జాయి ఇప్పుడు ఆ స్టార్ హీరో సతీమణి.. తెలుగులో ఒక్క సినిమానే చేసింది.. ఎవరో గుర్తుపట్టండి.
Actress
Follow us on

పైన ఫోటోలో ఉన్న ఈ అమాయకపు చూపుల బుజ్జాయి.. తెలుగులో చేసింది ఒక్క సినిమానే.. కానీ ఫాలోయింగ్ మాత్రం ఎక్కువే సంపాదించుకుంది. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల కలల రాకుమారిగా మారిన ఈ బ్యూటీ.. కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే ఓ స్టార్ హీరోను ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా వరుస చిత్రాలతో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఎవరో గుర్తుపట్టండి. తన భర్త కూడా తెలుగులో పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. హీరోగానే కాకుండా ప్రతినాయకుడిగానూ మెప్పించి.. విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. గుర్తుపట్టారా ఈ చిన్నారి ఎవరో.

పైన వైట్ డ్రెస్‏లో క్యూట్ ఏంజిల్‏లా ఉన్న చిన్నారి మరెవరో కాదు.. కోలీవుడ్ బ్యూటీ సయేషా సైగల్. తెలుగుతోపాటు.. హిందీ.. తమిళ్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అక్కినేని అఖిల్ నటించిన అఖిల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‏గా నిలిచింది.

ఇవి కూడా చదవండి

దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. కోలీవుడ్ స్టార్ హీరో ఆర్యను 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరికి ఓ పాప ఉంది. ఇటీవలే సయేషా సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.