Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. ‘అర్జున్ రెడ్డి’ బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..

|

Oct 26, 2024 | 8:46 AM

అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ హిట్టయ్యిందో చెప్పక్కర్లేదు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన ఈ మూవీలో విజయ్ దేవరకొండ, షాలిని పాండే హీరోహీరోయిన్లుగా నటించారు. ఇందులో జియా శర్మ సెకండ్ హీరోియన్ గా కనిపించింది. ఇప్పుడు ఆ అమ్మడు ఏం చేస్తుందో తెలుసా..

Arjun Reddy: తస్సాదియ్యా.. ఏం మేకోవర్ భయ్యా.. అర్జున్ రెడ్డి బ్యూటీని ఇప్పుడు చూస్తే ప్రేమలో పడాల్సిందే..
Jia Sharma
Follow us on

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా అర్జున్ రెడ్డి. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా వెండితెరకు పరిచయమైన ఈ హీరో.. అంతకు ముందు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. అర్జున్ రెడ్డి సినిమా ఏ రేంజ్ హిట్టయ్యిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో విజయ్ దేవరకొండ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఒక్క సినిమాతోనే స్టార్ డమ్ అందుకున్న విజయ్.. ఆ తర్వాత హీరోగా వరుస ఆఫర్స్ అందుకుంటూ తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఈ సినిమాలో నటించిన చాలా మందికి ఇండస్ట్రీలో ఛాన్సులు వచ్చాయి. ఇదే చిత్రాన్ని హిందీలో కబీర్ సింగ్ పేరుతో రీమేక్ చేసి అక్కడ కూడా భారీ విజయాన్ని అందుకున్నాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి. ఇక ఈ చిత్రంలో అందం, అమాయకత్వంతో కట్టిపడేసింది హీరోయిన్ షాలిని పాండే. కానీ ఈ మూవీ తర్వాత ఈ అమ్మడుకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ఇక ఈ మూవీలో షాలిని పాండే కాకుండా మరో అమ్మాయి కూడా స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. తనే జియా శర్మ. ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ నటించింది జియా శర్మ. ఇందులో గ్లామర్ లుక్‏లో మెరిసింది. మొదటి సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ అయిన ఈ నటికి.. ఆ తర్వాత మాత్రం అవకాశాలు రాలేదు. అందుకు కారణం కూడా గతంలోనే చెప్పుకొచ్చింది. అర్జున్ రెడ్డి మూవీ ప్రమోషన్లలో తాను కనిపించలేదని.. ఆ సినిమా సక్సెస్ ఎంజాయ్ చేసే స్థితిలో అప్పట్లో తాను లేనని చెప్పింది. ఆ సమయంలో తన తల్లి క్యాన్సర్ బారిన పడి ఆసుపత్రితో ఉండడంతో.. తనకు తండ్రి కూడా లేకపోవడంతో తల్లిని చూసుకునేందుకు సినిమాలకు బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. కానీ ఆమె తల్లిని కూడా కోల్పోయింది.

దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న జియా శర్మ.. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత ఎదురీత చిత్రంలో నటించింది. 2021లో క్షణక్షణం అనే తెలుగు థ్రిల్లర్ మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా కూడా సక్సెస్ కాలేదు. దీంతో జియాకు అనుకున్నంత గుర్తింపు రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న జియా.. లేటేస్ట్ ఫోటోస్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.