Mahanati : మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా? ఇప్పుడెలా ఉందో చూశారా?

|

Jul 21, 2024 | 12:34 PM

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహా నటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు

Mahanati : మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి ఆ స్టార్ నటుడి మనవరాలా? ఇప్పుడెలా ఉందో చూశారా?
Mahanati Child Artist
Follow us on

దివంగత నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన చిత్రం మహా నటి. 2018లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. అంతేకాదు అవార్డుల పంట పండింది. ఇదే సినిమాకు జాతీయ ఉత్తమ నటిగా పురస్కారం అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో ఆమె నటించింది అనడం కన్నా జీవించింది అని చెప్పొచ్చు. అంతలా సావిత్రమ్మ పాత్రకు ప్రాణం పోసింది కీర్తి సురేవ్. వైజయంతి మూవీస్, స్వప్న సినిమాస్ పతాకాలపై ప్రియాంక దత్ ఈ సినిమాను నిర్మించారు. సి అశ్వనీదత్ సమర్పకుడిగా వ్యవహరించారు. దుల్కర్ సల్మాన్, సమంత, విజయ్ దేవరకొండ, షాలిని పాండే, మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించగా.. మోహన్ బాబు, నాగ చైతన్య, క్రిష్, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగా, సాయి మాధవ్ బుర్రా తదితరులు అతిథి పాత్రల్లో మెరిశారు. కాగా మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి, సుశీల పాత్రల్లో ఇద్దరు చిన్నారులు మెరిశారు. ముఖ్యంగా సావిత్రి లాంటి బరువైన పాత్రను పోషించిన పాప అందరినీ ఆకట్టుకుంది. ‘ఆగిపో బాల్యమా.. నవ్వులో నాట్యమా సరదా సిరిమువ్వలవుదాం’సాంగ్‌తో పాటు పలు సీన్లలో ఆ పాప అభినయం, హావా భావాలు అందరినీ కట్టి పడేశాయి. ఇంతకీ ఆ పాప ఎవరో తెలుసా.? ప్రముఖ స్టార్ హీరో, నవ్వుల రేడు రాజేంద్ర ప్రసాద్ మనవరాలు సాయి తేజశ్విని.

మహానటి సినిమాలో చిన్నప్పటి సావిత్రి పాత్రలో చాలా చక్కగా నటించింది సాయి తేజశ్విని. అరే సావిత్రి చిన్నప్పుడు ఇలాగే ఉండేదా?అని పించేలా ఎంతో సహజంగా నటించిందీ స్టార్ కిడ్. ఈ సినిమా రిలీజై అప్పుడే 8 ఏళ్లు నిండిపోయాయి. ఇప్పుడీ చిన్నారి మరింత క్యూట్ గా,బబ్లీగా మారిపోయింది. మహానటి తర్వాత బేబీ, సిరివెన్నెల, సరిలేకు నీకెవ్వరు, ఎర్ర చీర తదితర సినిమాల్లో నటించింది సాయి తేజస్విని. గతంలో సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ గా ఉండేది. అయితే ఇప్పుడు మాత్రం దూరంగా ఉంటోంది. బహుశా సాయి తేజశ్విని ప్రస్తుతం తన చదువుపై పూర్తి దృష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.