Guess The Actress: మహేష్ పక్కనున్న ఈ అమ్మడు గుర్తుందా.. ఇప్పుడు ఆమె బోల్డ్ క్యారెక్టర్స్‌తో కేక పెట్టిస్తోంది

|

Mar 16, 2023 | 3:28 PM

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ తో పాటు వెంకటేష్ నటించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Guess The Actress: మహేష్ పక్కనున్న ఈ అమ్మడు గుర్తుందా.. ఇప్పుడు ఆమె బోల్డ్ క్యారెక్టర్స్‌తో కేక పెట్టిస్తోంది
Guess The Actress
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సీరిమల్లె చెట్టు సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మహేష్ తో పాటు వెంకటేష్ నటించారు. చక్కటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు కామెడీ టైమింగ్ హైలైట్ అనే చెప్పాలి. ఈ మూవీలో అన్ని ఎమోషన్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. అయితే ఈ పై ఫొటోలోని సీన్ గుర్తుందా..? మహేష్ బాబు ట్రైన్ లో పక్క సీట్ లోకేకూర్చున్న అమ్మాయిని ఫ్లట్  చేసే సీన్ ఇది. ఈ సీన్ లో డైలాగ్ చాలా ఫేమస్ అయ్యింది కూడా.. చూసిన రెండు నిమిషాలకే పడిపోతుంది ప్రతీదీ అంటూ మహేష్ చెప్పిన డైలాగ్ ఫెమస్ అయ్యింది.

అయితే ఈ సీన్ లో నటించిన అమ్మాయి గుర్తుందా..? చాలా క్యూట్ గా ఉన్న అమ్మాయి.. ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. ఈ అమ్మడు పేరు సుప్రియ అయిసోల.  టాలీవుడ్ లో పలు సినిమాల్లో ముఖ్యమైన పాత్రలు పోషించింది ఈ చిన్నది. ముఖ్యంగా  అవసరాల శ్రీనివాస్ నటించిన ‘బాబు బాగా బిజీ’ అనే సినిమాలో బోల్డ్ గా నటించి షాక్ ఇచ్చింది.

ఆ తర్వాత కూడా అలాంటి పాత్రలే వచ్చాయి. ఇక ఇప్పుడు ఈ చిన్నది బాలీవుడ్ లో బిజీ అయ్యింది. తాజాగా రానానాయుడు సిరీస్ లో కీలక పాత్రలో కనిపించింది ఈ భామ. తాజాగా ఈ అమ్మడు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Supriya Aysola Of