
మ్యాచో మ్యాన్ గోపి చాంద్ చాలా కాలంగా సక్సెస్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా.. విభిన్నమైన కథలతో చేస్తున్నా ఈ టాల్ హీరోకి సక్సెస్ మాత్రం దక్కడం లేదు.. ఇక ఇప్పుడు ఓ హిస్టారికల్ సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నాడు ఈ స్టార్ హీరో.. కాగా ఒకానొక సమయంలో గోపీచంద్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకునేవి. అప్పట్లో గోపిచంద్ వరుసగా హిట్ అందుకున్నారు. బ్యాక్ టు బ్యాక్ సూపర్ హిట్స్ తో బాక్సాఫీసు దగ్గర సందడి చేశారు. కానీ ఇప్పుడు ఆయన స్టార్ హీరో రేసులో వెనుకబడ్డారు. చిన్న హీరోలు, స్టార్ హీరోలు సక్సెస్ లు కొడుతుంటే గోపి మాత్రం ఇంకా సాలిడ్ సక్సెస్ కోసం వెయిట్ చేయాల్సి వస్తోంది. గోపీచంద్ ఇప్పటికే చాలా రకాల జోనర్స్ టచ్ చేశారు.
ఫ్యామిలీ, యాక్షన్, లవ్ ఇలా ఎన్ని జోనర్స్ చేసినా కూడా అవి బాక్సాఫీస్ దగ్గరవిజయం సాదించలేకపోతున్నాయి. చివరిగా భీమా అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ ఈ సినిమా కూడా వర్కౌట్ కాలేదు. ప్రస్తుతం శ్రీను వైట్ల దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు గోపీచంద్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇదిలా ఉంటే గోపీచంద్ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో రణం సినిమా ఒకటి. అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో వచ్చిన రణం సినిమా గోపీచంద్ కెరీర్ లో వన్ ఆఫ్ ది హిట్ గా నిలిచింది. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీ మంచి సక్సెస్ సాధించింది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన బ్యూటీ గుర్తుందా..?
చేసింది కొన్ని సినిమాలే కానీ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకుంది ఆమె. ఆ అమ్మడి పేరు కామ్నా జెఠ్మలానీ. టాలీవుడ్ లో ఈ బ్యూటీ తక్కువ సినిమాలే చేసింది. రణం సినిమా తర్వాత అల్లరి నరేష్ బెండప్పారావు సినిమాలో నటించింది. ఆతర్వాత ఊహించని విధంగా సినిమాలకు దూరం అయ్యింది ఈ చిన్నది. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది. 2014 ఆగస్ట్ 11న బెంగుళూరుకు చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త సూరజ్ నాగ్ పాల్ ను పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసింది ఈ చిన్నది. మొన్నామధ్య ఓ సినిమాలో మెరిసింది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అభిమానులను పలకరిస్తుంది కామ్నా జెఠ్మలానీ.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..