Tollywood: ‘జోష్’ సినిమాలో చైతూకి జోడిగా నటించిన ఈ హీరోయిన్ ఇప్పుడెలా ఉందంటే?
'జోష్' సినిమాతో అక్కినేని నాగచైతన్య తెలుగుతెరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఇదే చిత్రంతో..
‘జోష్’ సినిమాతో అక్కినేని నాగచైతన్య తెలుగుతెరకు హీరోగా పరిచయమైన సంగతి తెలిసిందే. ఇక ఇదే చిత్రంతో అలనాటి నటి రాధ కుమార్తె కార్తీక నాయర్ కూడా హీరోయిన్గా పరిచయమైంది. తొలి సినిమాతోనే నటన పరంగా మంచి మార్కులు కొట్టేసిన ఈ బ్యూటీకి.. అదృష్టం మాత్రం అంతంతమాత్రంగానే ఉంది. ఆ తర్వాత తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే తమిళంలో ‘కో’ చిత్రంలో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. అక్కడ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ హిట్ సాధించింది. అలాగే మలయాళం ఇండస్ట్రీకి ‘మకరమంజు’ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా సక్సెస్ సాధించినా.. ఈ అందాల భామకు ఎక్కువ ఛాన్స్లు రాలేదు. 2014లో అల్లరి నరేష్తో చేసిన ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాలి’ కార్తీకకు తెలుగులో చివరి సినిమా.
సినిమాలు అచ్చిరాకపోవడంతో బుల్లితెరపై కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కార్తీక నాయర్. 2017లో ‘ఆరంభ్’ అనే హిందీ సీరియల్లో నటించింది. ఇక ఇందులో కార్తీక నటనకు అటు అభిమానులు, ఇటు క్రిటిక్స్ ప్రశంసలు కురిపించారు. అయితే ఆ తర్వాత నుంచి మొత్తంగా సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది కార్తీక నాయర్. కాగా, ప్రస్తుతం తన కుటుంబంతో కలిసి కేరళలో నివసిస్తున్న కార్తీక. అక్కడే యూడీఎస్ గ్రూప్ ఆఫ్ హోటల్స్కు(udshotels) డైరెక్టర్గా పని చేస్తోంది.
View this post on Instagram