
నందమూరి బాలకృష్ణ హీరోగానే కాకుండా దర్శకత్వం కూడా చేశారని మీకు తెలుసా.. ? అవును.. తన తండ్రి సీనియర్ ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం ‘నర్తనశాల’ను అదే పేరుతో రీమేక్ చేయాలని సంకల్పించారు. ఈ సినిమాతోనే ఆయన దర్శకుడిగా కూడా పరిచయం కావాలనుకున్నారు. 2004లో అత్యంత వైభవంగా ఈ చిత్రం ప్రారంభమైంది. ఇందులో బాలకృష్ణ అర్జునుడు, బృహన్నల, కీచకుడు వంటి మూడు భిన్నమైన పాత్రల్లో నటించాల్సి ఉంది. ఈ సినిమాలో అత్యంత కీలకమైన ద్రౌపది పాత్ర కోసం సౌందర్యను ఎంపిక చేశారు. అలాగే అర్జునుడి కుమారుడైన అభిమన్యుడి పాత్ర కోసం అప్పటి యంగ్ సెన్సేషన్ ఉదయ్ కిరణ్ను తీసుకున్నారు. అప్పట్లో ఉదయ్ కిరణ్ క్రేజ్ దృష్టిలో ఉంచుకుని బాలయ్య ఆయనకు ఈ అవకాశం ఇచ్చారు.
ఎక్కువ మంది చదివినవి : Vijay Deverakonda : విజయ్ దేవరకొండ గుండెలపై కాలు పెట్టిన హీరోయిన్.. రౌడీ జనార్దన్ నుంచి పోస్టర్ రిలీజ్..
ఉత్తర పాత్ర కోసం అసిన్ను ఎంపిక చేశారు. ఒకే ఫ్రేమ్లో అగ్ర నటి సౌందర్య, యంగ్ స్టార్ ఉదయ్ కిరణ్, బాలయ్యను చూడటం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. కానీ ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన కొన్ని రోజులకే సౌందర్య హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆమె మరణం చిత్ర పరిశ్రమకు కోలుకోలేని దెబ్బ. సౌందర్య స్థానంలో మరొకరిని ఊహించుకోలేమని, ఆమెకు ఆ పాత్ర పట్ల ఉన్న గౌరవంతో బాలయ్య ఆ సినిమాను అర్ధాంతరంగా ఆపేయాలని నిర్ణయించుకున్నారు. ఆ తర్వాత ఉదయ్ కిరణ్ కూడా వ్యక్తిగత కారణాలతో బలవన్మరణం చెందడంతో ఈ ప్రాజెక్ట్ ఒక విషాద జ్ఞాపకంగా మిగిలిపోయింది.
ఎక్కువ మంది చదివినవి : యూట్యూబ్ నుంచి 30 లక్షల సంపాదన.. అసలు విషయం చెప్పిన సీరియల్ నటి..
అప్పట్లో షూట్ చేసిన దాదాపు 17 నిమిషాల ఫుటేజ్ను 2020 దసరా సందర్భంగా ఇటీవల సోషల్ మీడియాలో షేర్ చేశారు. . దీని ద్వారా వచ్చిన ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగించారు. సౌందర్య, ఉదయ్ కిరణ్ అభిమానులకు వారు కలిసి నటించిన ఈ చిన్న ఫుటేజ్ ఒక అపురూప కానుకగా నిలిచింది. ఒకవేళ ఈ సినిమా పూర్తయి ఉంటే, ఉదయ్ కిరణ్ కెరీర్కు ఇది ఒక మైలురాయిగా నిలిచేదని అభిమానులు భావిస్తుంటారు.
ఎక్కువ మంది చదివినవి : Sai Pallavi : ఆ హీరో నా ఫస్ట్ క్రష్.. అతడంటే చెప్పలేనంత ఇష్టం.. మనసులోని మాట చెప్పిన సాయి పల్లవి..
ఎక్కువ మంది చదివినవి : Actor : ఏంటీ సర్.. ఇలా మారిపోయారు.. ఫస్ట్ సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్.. కట్ చేస్తే.. ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న పాపులర్ నటుడు..