AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న చేస్తోన్న 29 ఏళ్ల హీరోయిన్.. వరుసగా మూడు సార్లు 500 కోట్ల సినిమాలు..

ప్రస్తుతం పాన్ ఇండియా లెవల్లో ఓ హీరోయిన్ దూసుకుపోతుంది. బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటూ సంచలనం సృష్టిస్తుంది. అందం, అభినయంతో కట్టిపడేస్తుంది. తెలుగు, హిందీ భాషలలో ఇప్పుడు ఆమె టాప్ హీరోయిన్. అంతేకాదు.. వరుసగా 500 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఆమెకు దక్షిణాదిలో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది.

Tollywood: బాక్సాఫీస్‏ను షేక్ చేస్తోన్న చేస్తోన్న 29 ఏళ్ల హీరోయిన్.. వరుసగా మూడు సార్లు 500 కోట్ల సినిమాలు..
Rashmika Mandanna
Rajitha Chanti
|

Updated on: Sep 29, 2025 | 4:14 PM

Share

ప్రస్తుతం పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతున్న హీరోయిన్లలో ఆమె ఒకరు. ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాలుగా ఆమె నటించిన చిత్రాలు ఊహించని రెస్పాన్స్ అందుకున్నాయి. వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు.. అలాగే బ్యాక్ టూ బ్యాక్ రూ.500, 700, 800, 1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతూ నెట్టింట దూసుకుపోతున్నాయి. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? ఇప్పటికీ చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడిపేస్తుంది. తెలుగుతోపాటు హిందీలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..? తనే నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఇప్పుడు ఈ బ్యూటీ జోరు మీదున్న సంగతి తెలిసిందే. 29 ఏళ్ల వయసులోనే బాక్సాఫీస్ వద్ద రికార్డ్స్ తిరగరాస్తుంది.

ఇవి కూడా చదవండి : Tollywood : 750కు పైగా సినిమాలు.. బ్రహ్మానందంతో ప్రత్యేక అనుబంధం.. ఈ కమెడియన్ ఎవరో గుర్తుపట్టారా.. ?

ఇవి కూడా చదవండి

2023లో ఆమె నటించిన యానిమల్ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా నటించిన ఈ సినిమా ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ హిట్. ఈ మూవీ దాదాపు రూ.900 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. కానీ ఈ చిత్రాన్ని కేవలం 100 కోట్లతో నిర్మించడం విశేషం. డిసెంబర్ 2024లో ఆమె నటించిన మరో చిత్రం పుష్ప 2. ఈ మూవీ సైతం వరుసగా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అంతేకాదు.. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్స్ బద్దలుకొట్టింది.

ఇవి కూడా చదవండి : Tollywood : తెలుగులో సెన్సేషన్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఇప్పుడు ఇలా..

ఇక మూడవ బ్లాక్ బస్టర్ విషయానికి వస్తే.. ఇటీవలే బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్ నటించిన ఛావా సినిమాతో వరుసగా మూడోసారి 500 కోట్లు వసూలు చేసింది. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించారు. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. గత రెండేళ్లలో వరుసగా రూ.500, 700, 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన హీరోయిన్ రష్మిక మందన్నా. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. మైసా, థామా, గర్ల్ ఫ్రెండ్, రెయిన్ బో చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇటీవల ఆమె షేర్ చేసిన జిమ్ వీడియో తెగ వైరలైన సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి : Andarivaadu Movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు గురూ.. చిరంజీవితో నటించిన ఈ హీరోయిన్ ఏం చేస్తుందంటే..

Follow Us