Rajamouli- Mahesh Babu : గల్లా పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేష్ బాబు.. ఏఐ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..

ప్రస్తుతం పాన్ వరల్డ్ లెవల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు వారణాసి. ఆర్ఆర్ఆర్ తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ మూవీ పై భారీ అంచనాలు ఉన్నాయి. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. అలాగే ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా జక్కన్న, మహేష్ కు సంబంధించి ఓ ఏఐ వీడియోను షేర్ చేశారు ఆర్జీవీ.

Rajamouli- Mahesh Babu : గల్లా పట్టుకొని కొట్టుకున్న రాజమౌళి, మహేష్ బాబు.. ఏఐ వీడియో షేర్ చేసిన ఆర్జీవీ..
Rgv

Updated on: Feb 24, 2026 | 3:17 PM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్… ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని మాయ చేస్తున్న టెక్నాలజీ. మన కళ్లకు కనిపిస్తున్నది నిజమో.. అబద్ధమో తెలుసుకోలేనంతగా సమాచారాన్ని వ్యాప్తి చేస్తుంది. అలాగే ఏఐ సహాయంతో సృష్టించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు కుప్పలు తెప్పలుగా సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా సెలబ్రెటీస్ విషయంలో కొందరు ఏఐ సాయంతో క్రియేట్ చేసిన వీడియోస్, ఫోటోస్ చక్కర్లు కొడుతున్నాయి. స్టార్స్ అందరూ కలిసి సినిమాలు చేసినట్లుగా.. లేదా అందరూ కలిసి పార్టీస్ జరుపుకున్నట్లుగా ఇదివరకు చాలా వీడియోస్ కనిపించాయి. కానీ ఇప్పుడు ఓ వీడియో మాత్రం అందరిని దృష్టిని మళ్లించింది. ఇప్పుడు అదే వీడియోను డైరెక్టర్ ఆర్జీవీ తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇప్పుడు ఆర్జీవీ షేర్ చేసిన వీడియో చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందామా.

ఎక్కువ మంది చదివినవి : Folk Song: ఏం పాట భయ్యా.. కుర్రాళ్లకు పిచ్చేక్కించేసింది.. యూట్యూబ్‏ను ఊపేసిన ఫోక్ సాంగ్..

ఆ వీడియోలో స్టార్ హీరో మహేష్ బాబు, డైరెక్టర్ రాజమౌళి గొడవపడుతున్నట్లు కనిపిస్తుంది. ఇద్దరూ గల్లా పట్టుకొని మరీ సీరియస్ గా కొట్లాడుతున్నారు. ఈ వీడియోను షేర్ చేస్తూ సినిమా ఈజ్ డెట్ (సినిమా చనిపోయింది) అంటూ రాసుకొచ్చారు వర్మ. అయితే ఇప్పుడు ఈ వీడియోపై నెటిజన్స్ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు మెచ్చుకుంటుంటే.. మరికొందరు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఏఐతో ఏదైనా సాధ్యమే.. అబద్ధాన్ని నిజమని స్పష్టం చేస్తున్నారు అని కొందరు అంటుంటే.. ఇంకొందరు.. జక్కన్న మహేష్ ఇద్దరూ పాస్ పోర్ట్ విషయంలోనే గొడవపడుతున్నారంటూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : రమ్యకృష్ణ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. మొదటిసారి తనయుడి గురించి చెప్పిన కృష్ణ వంశీ..

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న లేటేస్ట్ మూవీ వారణాసి. యాక్షన్ అడ్వైంచర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో రిలీజ్ చేయనున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Actress : రాజమౌళి మాటలతో నా గుండె పగిలిపోయింది.. ఆ సినిమా వదులుకోకుండా ఉండాల్సింది.. టాలీవుడ్ హీరోయిన్..

ఎక్కువ మంది చదివినవి : Actress : ఏంట్రా బాబూ.. ఈ సీరియల్ బ్యూటీ ఇంతందంగా మారిపోయింది.. 100 పైగా సినిమాల్లో నటించింది..

Follow Us