Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..

|

Mar 09, 2022 | 2:39 PM

ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న

Rajamouli: తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలపై డైరెక్టర్ రాజమౌళి ఆసక్తికర ట్వీట్స్.. ఏమన్నారంటే..
Rajamouli
Follow us on

ఏపీలో సినిమా టికెట్స్ రేట్లను పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సినీ ప్రముఖులు ధన్యవాదాలు తెలిపారు. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో.. సినీ పరిశ్రమ మరింత పుంజుకోవడానికి సహాయపడుతుందని తెలిపారు. అలాగే.. సినిమా టికెట్స్ రేట్స్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం… అటు సినిమా నిర్మాతలకు.. ఇటు ప్రేక్షకులకు మేలు చేస్తుందని సినీ ప్రముఖులు తెలిపారు. తాజాగా కొత్త జీవో పై డైరెక్టర్ రాజమౌళి స్పందించారు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్ చేశారు. సినిమా టిక్కెట్ రేట్లను సవరిస్తూ కొత్త జీవో ఇచ్చిన ఏపి సిఎం జగన్ కు ధన్యవాదములు తెలుపుతూ దర్శకుడు రాజమౌళి ట్వీట్ చేశారు.

“కొత్త జీవోలో సవరించిన టిక్కెట్ ధరల ద్వారా తెలుగు చలనచిత్ర వర్గానికి సహాయం చేసినందుకు ఏపీ సిఎం జగన్ గారికి.. మంత్రి పేర్ని నాని గారికి ధన్యవాదాలు. ఇది సినిమాల పునరుద్ధరణకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు..

అలాగే.. “పెద్ద సినిమాలకు రోజుకు 5 షోలను అనుమతించినందుకు సీఎం కేసీఆర్‌గారికి, తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు మాకు మీ నిరంతర మద్దతు కోసం తలసాని శ్రీనివాస్ యాదవ్ గారికి ధన్యవాదాలు. తెలంగాణాలో ఇది సినీ వర్గానికి పెద్ద ఊరటనిస్తుది” అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‏కు కృతజ్ఞతలు తెలిపారు.

Also Read: Samantha: నయా బిజినెస్‌లోకి అడుగుపెట్టిన సామ్‌.. నాగ చైతన్యకు పోటీగానే అంటోన్న నెటిజన్లు..

Priya Prakash Varrier: క్యూట్ క్యూట్‏గా కవ్విస్తున్న ప్రియా వారియర్..మలయాళీ భామ అందమైన లేటెస్ట్ ఫొటోస్.

Samyuktha Menon: భీమ్లానాయక్ బ్యూటీకి ఫిదా అయినా తెలుగు ప్రేక్షకులు.