‘యాత్ర 2’ లో ఆ ఇద్దరి చరిత్ర

|

May 29, 2019 | 1:20 PM

హైదరాబాద్‌: వైసీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అలాగే జగన్ తాతగారైనా రాజారెడ్డి లేకుండా తన ‘యాత్ర 2’ సినిమా పూర్తికాదని అంటున్నారు దర్శకుడు మహి వి.రాఘవ్‌. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో నటించారు. వైఎస్సార్‌ చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే […]

యాత్ర 2 లో ఆ ఇద్దరి చరిత్ర
Follow us on

హైదరాబాద్‌: వైసీపీ అధినేత, కాబోయే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి అలాగే జగన్ తాతగారైనా రాజారెడ్డి లేకుండా తన ‘యాత్ర 2’ సినిమా పూర్తికాదని అంటున్నారు దర్శకుడు మహి వి.రాఘవ్‌. దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితాధారంగా తెరకెక్కించిన చిత్రం ‘యాత్ర’. మలయాళ సూపర్‌స్టార్‌ మమ్ముట్టి ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో నటించారు. వైఎస్సార్‌ చేసిన పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద మంచి విజయం అందుకుంది. అయితే తన తండ్రిలాగే జగన్‌ పాదయాత్ర చేసి ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలిచారు. ఈ నేపథ్యంలో ‘యాత్ర’కు కొనసాగింపుగా ‘యాత్ర 2’ తీస్తానని దర్శకుడు రాఘవ్‌ కొన్ని రోజుల క్రితం ప్రకటించారు. తాజాగా ఈ సినిమా గురించి రాఘవ్‌ ట్విటర్‌ వేదికగా ఓ అప్‌డేట్‌ ఇచ్చారు.

‘వైఎస్‌ రాజారెడ్డి, వైఎస్‌ జగన్‌ లేకుండా వైఎస్సార్‌ కథకు ముగింపు ఉండదు. ‘యాత్ర 2’ ద్వారా వీరి ముగ్గురి కథ గురించి చెప్పి సినిమాకు ముగింపు చెప్తాను. ‘యాత్ర’ సినిమాను జగన్‌ ప్రస్తావనతోనే ముగించేశాం. రెండో భాగంలో జగన్‌ ప్రయాణం గురించి చూపించాలనుకుని అలా చేశాం. వైఎస్సార్‌ యాత్ర ఆయన తండ్రి రాజా రెడ్డి సమాధి నుంచి మొదలైతే…జగన్‌ యాత్ర తన తండ్రి సమాధి నుంచి ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు రాఘవ్‌.