
బిగ్ బాస్ సీజన్ 9 త్వరలోనే పూర్తి కాబోతుంది. చివరి దశకు వచ్చే సరికి సీజన్ 9 మరింత ఆసక్తికరంగా మారింది. హౌస్ మేట్స్ మధ్య చిత్ర విచిత్రమైన టాస్క్ లు పెట్టాడు బిగ్ బాస్. ఓల్డ్ కంటెస్టెంట్స్ ను రంగంలోకి దింపాడు. గౌతమ్, మానస్, దేతడి హారిక, ప్రియాంక, ప్రేరణ, హౌస్ లోకి వచ్చారు. అలాగే నిన్నటి ఎపిసోడ్ లోనూ కొంతమంది ఎక్స్ హౌస్ మేట్స్ ఎంట్రీ ఇచ్చారు. చివరి వారం కెప్టెన్ అవ్వడానికి టాస్క్ లు పెడుతున్నాడు బిగ్ బాస్. చివరి వారంలో ఆరుగురు హౌస్మేట్స్ కెప్టెన్సీ కంటెండర్లు అయ్యారు. నిన్నటి టాస్క్ ల్లో ముందుగా శోభాశెట్టి ఎంట్రీ ఇచ్చింది. దివ్యతో ఆమె టాస్క్ ఆడింది. అయితే శోభ శెట్టి పై దివ్య ఈజీగా విన్ అయ్యింది. దాంతో ఆమెకూడా కెప్టెన్సీ కంటెండర్ అయ్యింది.
ఆతర్వాత సోహెల్ హౌస్ లోకి వచ్చి సందడి చేశాడు. ఆతర్వాత సంజన, రీతూలకి బిగ్బాస్ ఛాన్స్ ఇచ్చాడు. ఈ ఇద్దరూ కెప్టెన్సీ కంటెండర్స్ అవ్వలేదు. దాంతో వారికి ఛాన్స్ ఇచ్చాడు. సంజన-రీతూ ఇద్దరూ కంటెండర్లు అయ్యారు. కళ్యాణ్, డీమాన్, ఇమ్మానుయేల్, దివ్య, సంజన, రీతూ కెప్టెన్సీ రేస్ లో ఉన్నారు. వీరిలో ఒకరు హౌస్ లో చివరి కెప్టెన్ అవ్వనున్నారు. నేడు జరిగే టాస్ లో ఎవరు కెప్టెన్ అవ్వుతారో తెలిసిపోతుంది.
అయితే చివరిగా జరిగిన టాస్క్ లో డీమన్ పవన్ విన్ అయ్యి కెప్టెన్ అయ్యాడని తెలుస్తుంది. దాంతో బిగ్ బాస్ చరిత్రలో మూడుసార్లు కెప్టెన్ అయిన కంటెస్టెంట్ గా నిలిచాడు పవన్. ఇప్పటికే పవన్, ఇమ్మాన్యూల్ రెండుసార్లు కెప్టెన్ అయ్యారు. ఇక ఫైనల్ గా డీమన్ ఫైనల్ టాస్క్ లో విన్ అయి మూడో సారి కెప్టెన్ అయ్యి రికార్డ్ క్రియేట్ చేశాడు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.