
దివంగత నటుడు కృష్ణంరాజు గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తెలుగు సినిమాను శాసించిన స్టార్ హీరోల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు ఆయన సినీ వారసత్వాన్ని ప్రభాస్ కంటిన్యూ చేస్తున్నాడు. పాన్ ఇండియా హీరోగా రాణిస్తున్నారు. సినిమాల సంగతి పక్కన పెడితే.. ప్రభాస్ తోటి నటీనటులను ఎంత బాగా చూసుకుంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇంటి నుంచి ఫుడ్ తెప్పించి మరీ తోటి యాక్టర్స్ కడుపు నింపుతుంటాడు. కృష్ణం రాజు, ప్రభాస్ ఫుడ్ పెట్టడం, వారి మర్యాదలు ఎలా ఉంటాయో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు అనేక సందర్భాల్లో వెల్లడించాడు. తాజాగా స్టార్ కమెడియన్ అలీ కూడా కృష్ణంరాజుతో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను పంచుకున్నాడు. ఇటీవల ఓ సినిమా ఈవెంట్ కు కృష్ణంరాజు సతీమణి హాజరయ్యారు. అలీ కూడా ఇదే ఈ వెంట్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ బిల్లా సినిమా షూటింగ్ లో భాగంగా మలేషియాలో జరిగిన ఓ ఆసక్తికర సంఘటనను గుర్తు చేసుకుఉన్నాడు.
‘రాత్రి 3 గంటలకు చిమ్మ చీకటి. స్మశానంలో బిల్లా సినిమా షూటింగ్ జరుగుతుంది. అప్పుడు కృష్ణంరాజు గారు నా దగ్గరికి వచ్చి అరె అలీ కీమా బిర్యానీ ఉంది తింటావా అని అడిగారు. అర్ధరాత్రి బిర్యానీ ఏంటండీ.. అది కూడా స్మశానంలో అంటే.. సమాధులను చూపిస్తూ వాళ్లకు అవకాశం లేదురా మనకు ఛాన్స్ ఉంది అన్నారు. అప్పుడే శ్యామల గారు బిర్యానీ తీసుకొచ్చి వడ్డిస్తే అర్ధరాత్రి అక్కడ స్మశానంలో బిర్యానీ తిన్నాం. బిల్లా సినిమా షూటింగ్ కోసం దాదాపు 40 రోజులు మలేషియాలో ఉన్నాం. అప్పుడు కృష్ణం రాజుగారు రోజుకొక ఐటెం తెచ్చిపెట్టేవాళ్ళు. ఒకసారి తెచ్చిన ఫుడ్ ఐటెం మళ్లీ తెచ్చేవాళ్లు కాదు’ అని అప్పటి క్షణాలను గుర్తు తెచ్చుకున్నారు అలీ. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.