Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

12మందితో ఎఫైర్.. ఒకరితో పెళ్లి.. కట్ చేస్తే మద్యానికి బానిసై ఇలా..

లేని పోనీ ఎఫైర్స్ ద్వారా కెరీర్ లాస్ అయిన హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ మధ్య నటి నిఖిత కూడా అంతే కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్ళైన నటుడితో ఎఫైర్ పెట్టుకుంది. కట్ చేస్తే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆఫర్స్ లేక చివరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అలాగే మరో హీరోయిన్ కూడా తోటి నటులతో ప్రేమలో పడి కెరీర్ పై ద్రుష్టి పెట్టలేకపోయింది. దాంతో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందిపడింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

12మందితో ఎఫైర్.. ఒకరితో పెళ్లి.. కట్ చేస్తే మద్యానికి బానిసై ఇలా..
Actress
Follow us
Rajeev Rayala

|

Updated on: Jun 11, 2024 | 12:08 PM

సినిమా ఇండస్ట్రీలో లవ్ , బ్రేకప్, పెళ్లిళ్లు, విడిపోవడాలు చాలా కామన్ గా మారిపోయాయి. ఈ మధ్యకాలంలో చాలా మంది పెళ్లిళ్లు చేసుకొని సెటిల్ అవుతుంటే మరికొంతమంది విడాకులు, బ్రేకప్స్ తో వార్తల్లో నిలుస్తున్నారు. ఇక ఒకరితో ప్రేమాయణం నడిపి మరొకరిని పెళ్లి చేసుకున్న హీరోలు, హీరోయిన్స్ చాలా మంది ఉన్నారు. లేని పోనీ ఎఫైర్స్ ద్వారా కెరీర్ లాస్ అయిన హీరోయిన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఆ మధ్య నటి నిఖిత కూడా అంతే.. కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు పెళ్ళైన నటుడితో ఎఫైర్ పెట్టుకుంది. కట్ చేస్తే కెరీర్ క్లోజ్ అయ్యింది. ఆఫర్స్ లేక చివరికి పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యింది. అలాగే మరో హీరోయిన్ కూడా తోటి నటులతో ప్రేమలో పడి కెరీర్ పై దృష్టి పెట్టలేకపోయింది. దాంతో ఆఫర్స్ లేక చాలా ఇబ్బందిపడింది. ఆ హీరోయిన్ ఎవరో తెలుసా.?

ఒక హీరోయిన్ ఒకరితో ప్రేమలో పడటం సహజం.. కొంతమంది ఇద్దరూ.. ముగ్గురిని కూడా ప్రేమించిన వారు ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం ఏకంగా 12మందితో ఎఫైర్ పెట్టుకుంది. ఆ బ్యూటీ ఎవరో కాదు మనీషా కోయిరాల.. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే.. చాలా డబ్బింగ్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.  1991లో సౌదాగర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బాలీవుడ్ బ్యూటీ. ఆతర్వాత చాలా తమిళ్, హిందీ సినిమాల్లో నటించింది.

ముఖ్యంగా తమిళ్ మూవీస్ భారతీయుడు, ఒకేఒక్కడు, బొంబాయి సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది. అలాగే హిందీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది. షారుక్ ఖాన్ హీరోగా మనీషా హీరోయిన్ గా నటించిన దిల్ సే సినిమా సంచలన విజయం సాధించింది. ఇదిలా ఉంటే ఈ అమ్మడు అప్పట్లో చాలా మందితో ప్రేమాయణం నడిపిందని వార్తలు వచ్చాయి. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 12మందితో ప్రేమలో పడింది ఈ బ్యూటీ. చాల మంది కో స్టార్స్ తో ఆమె ప్రేమలో పడిందని అప్పటిలో తెగ వార్తలు చక్కర్లు కొట్టాయి. కానీ ఆప్రేమాయణాలన్నీ ఎక్కువకాలం నిలవలేదు. ఇక 2010లో నేపాల్‌కు చెందిన సామ్రాట్ దహల్‌ను మనీషా కోయిరాల వివాహం చేసుకునే ఆ తర్వాత రెండేళ్లకే విడిపోయింది. ఆతర్వాత వరుసగా సినిమాలు ప్లాప్ అవడంతో డిప్రషన్ లో మద్యానికి బానిసయ్యింది. అదే సమయంలో మనీషా కోయిరాల క్యాన్సర్ బారిన పడింది. కానీ దైర్యంగా క్యాన్సర్ ను ఎదిరించి విజయం సాధించింది. ఇటీవలే ఈ అమ్మడు హీరమండి వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ మంచి విజయని సొంతం చేసుకుంది.

మనీష కోయిరాల ఇన్ స్టా గ్రామ్..

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మనీష కోయిరాల ఇన్ స్టా గ్రామ్..

View this post on Instagram

A post shared by Manisha Koirala (@m_koirala)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.