Tollywood: బాబోయ్.. బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు సన్నజాజీలా మారింది.. ఆ గ్లామర్ క్వీన్ ఎవరో తెలుసా ?..

|

Apr 26, 2024 | 12:08 PM

బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ తార.. ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో అందాల రాశి. ముఖ్యంగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసే ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇంతకీ పైన ఫోటోను చూశారు కదా.. ఒకప్పుడు బొద్దుగా అశలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు మాత్రం అభిమానుల ఫేవరేట్ నటి. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: బాబోయ్.. బొద్దుగా ఉన్న ఈ అమ్మాయి ఇప్పుడు సన్నజాజీలా మారింది.. ఆ గ్లామర్ క్వీన్ ఎవరో తెలుసా ?..
Actress 1
Follow us on

అందంగా కనిపించడం కోసం హీరోహీరోయిన్స్ ఎంతో కష్టపడుతుంటారు. ఫిట్నెస్ కాపాడుకోవడానికి కఠినమైన వర్కవుట్స్, వ్యాయమాలు చేస్తుంటారు. అలాగే డైట్, వర్కవుట్స్ చేస్తూ తమ అందాన్ని మరింత రెట్టింపు చేసుకుంటారు. ఇక మరికొందరు మాత్రం అందంగా కనిపించేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారు. అయితే ఇలా సర్జరీ చేయించుకున్న నటీనటులను ఇట్టే గుర్తుపట్టేస్తారు నెటిజన్స్. మరికొందరిని మాత్రం అసలు గుర్తుపట్టలేరు. తాజాగా బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ బ్యూటీకి సంబంధించిన ఓల్డ్ ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. బుల్లితెరపై సీరియల్స్ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆ తార.. ఇప్పుడు గ్లామర్ ప్రపంచంలో అందాల రాశి. ముఖ్యంగా ఈ అమ్మడు నెట్టింట షేర్ చేసే ఫోటోస్ తెగ వైరలవుతుంటాయి. ఇంతకీ పైన ఫోటోను చూశారు కదా.. ఒకప్పుడు బొద్దుగా అశలు గుర్తుపట్టడానికి వీలు లేకుండా ఉన్న ఆ అమ్మాయి ఇప్పుడు మాత్రం అభిమానుల ఫేవరేట్ నటి. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.. తనే మౌనీ రాయ్.

మౌనీ రాయ్.. ఈపేరు బాలీవుడ్, టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమైన పేరు. నాగిన్ అనే హిందీ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది. ఈ సిరీయిల్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలలోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి అలరించింది. కేరళకు చెందిన సూరజ్ నంబియార్ ను వివాహం చేసుకుంది మౌనీరాయ్. అతడు దుబాయ్ లో బ్యాంకర్ గా వర్క్ చేస్తున్నాడు. మౌని పాత చిత్రాలు ఇప్పుడు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అప్పటి కంటే ఇప్పుడు మరింత అందంగా మారిపోయి కనిపిస్తుంది. సర్జరీ తర్వాత అసలు గుర్తుపట్టలేని విధంగా అందంగా మారిపోయింది మౌనీరాయ్.

మౌని ఏక్తా కపూర్ సీరియల్ ‘క్యుమ్కీ సాస్ భీ కభీ బహు థీ’తో నటనా రంగంలోకి ప్రవేశించింది. ఆ తర్వాత కస్తూరి, దో సహేలియన్, దేవోమ్ కా దేవ్ మహాదేవ్, జునూన్ వంటి సీరియల్స్‌లో నటించింది. కానీ ఆమెకు నాగిన్ సినిమా మాత్రమే గుర్తింపు తెచ్చిపెట్టింది. అక్షయ్ కుమార్ నటించిన ‘గోల్డ్’ చిత్రంతో మౌని బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెట్టింది. కేజీఎఫ్ హిందీ రీమేక్‌లో ‘గాలి గాలి’ అనే పాటలో మెరిసింది. అలాగే రణబీర్ కపూర్, అలియా భట్, నాగార్జున నటించిన బ్రహ్మాస్త్ర సినిమాలో నటించింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.