Tollywood: ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఎవరో గుర్తుపట్టారా.. ?

అలాగే అనుకోకుండా నటనవైపు అడుగులు వేసినవారు ఉన్నారు. కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మాత్రం ఒకప్పుడు న్యూస్ రీడర్. ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్‏గా పనిచేసింది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. నటిగా కెరీర్ మొదలుపెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు సంపాదించుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?..

Tollywood: ఒకప్పుడు న్యూస్ రీడర్.. ఇప్పుడు స్టార్ హీరోయిన్.. కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. ఎవరో గుర్తుపట్టారా.. ?
Actress
Follow us

|

Updated on: May 09, 2024 | 8:17 PM

ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో పరభాష నటీమణులు తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. అందం, అభినయంతో ప్రేక్షకులను మెప్పించి వరుస ఆఫర్స్ అందుకుంటున్నారు. అందులో నటనపై ఆసక్తితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినవారు ఉన్నారు. అలాగే అనుకోకుండా నటనవైపు అడుగులు వేసినవారు ఉన్నారు. కానీ పైన ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి మాత్రం ఒకప్పుడు న్యూస్ రీడర్. ఓ ప్రముఖ ఛానల్లో న్యూస్ రీడర్‏గా పనిచేసింది. అలాగే యాంకరింగ్ కూడా చేసింది. నటిగా కెరీర్ మొదలుపెట్టకముందే బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యింది. ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో అవకాశాలు అందుకుంటూ నటిగా ప్రశంసలు సంపాదించుకుంటుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా ?.. గ్లామర్ షో కాకుండా పాత్ర ప్రాధాన్యత, కంటెంట్ బలంగా ఉన్న సినిమాలనే ఎంచుకుంటుంది. ఇప్పటివరకు ఆ ముద్దుగుమ్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకున్నాయి. ఇప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో రాణిస్తున్న ఈ హీరోయిన్ మరెవరో కాదండి.. కోలీవుడ్ బ్యూటీ ప్రియా భవానీ శంకర్.

1989లో తమిళనాడులో జన్మించింది ప్రియా భవానీ శంకర్. మొదట్లో న్యూస్ ప్రజెంటర్ గా పనిచేసింది. పుతియ తలైమురైలో న్యూస్ చదివేది. ఆ తర్వాత బుల్లితెరపై పలు సీరియల్లలో నటించింది. కళ్యాణ్ ముదల్ కాదల్ వరై సీరియల్లో మెయిన్ రోల్ పోషించింది. ఇక ఆ తర్వాత వైభవ్ రెడ్డి హీరోగా వచ్చిన మేయదా మాన్ అనే సినిమాతో కథానాయికగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈసినిమాకు ఉత్తమ నూతన నటిగా సైమా అవార్డ్ అందుకుంది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్ స్టార్ కార్తీ నటించిన కడై కుట్టి సింగం (చినబాబు) సినిమాలో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. ఎస్ జే సూర్య జోడిగా మాన్ స్టర్ చిత్రంలో మెప్పించింది. ఇవే కాకుండా ఓ మన్నేపిన్నే, బ్లడ్ మనీ, హాస్టల్, యానాయ్ వంటి చిత్రాల్లో నటించింది. తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ప్రియా.. తిరు సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ నటించిన ఈ మూవీలో ముఖ్య పాత్ర పోషించింది.

టాలీవుడ్ యంగ్ హీరో సంతోష్ శోభన్ నటించిన కళ్యాణం కమనీయం సినిమాతో కథానాయికగా తెలుగు తెరకు పరిచయమైంది. ఆ తర్వాత నాగచైతన్య నటించిన ధూత వెబ్ సిరీస్ లో నటించింది. ఇటీవలే గోపిచంద్ జోడిగా భీమా సినిమాలో మెప్పించింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి తెలుగులో మరిన్ని ఆఫర్స్ వచ్చినట్లుగా తెలుస్తోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
దుర్భర స్థితిలో అక్కడి అమెజాన్‌ ఉద్యోగులు.! తాజా సర్వేలో షాకింగ్‌
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
గ్లోబల్‌ వార్మింగ్ ను తగ్గించే భారీ ప్లాంట్‌.! అక్కడే ఏర్పాటు..
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
చిన్నారి చేతి వేలికి సర్జరీ చేయాలి. కానీ డాక్టర్లు చేసిన ఆపరేషన్‌
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
అత్యాచారం కేసులో స్టార్‌ క్రికెటర్‌కు ఊరట.. వరల్డ్‌ కప్‌కు రెడీ.?
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
Thailand: థాయ్‌లాండ్‌ రాజధానికి పొంచి ఉన్న ముప్పు..!
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఆటోవాలా ఐడియాకు ప్రయాణికులు ఫిదా.! ఆటోకు కూలర్‌ ఏర్పాటు..
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
ఇడియట్ సిండ్రోమ్ అంటే ఏమిటో తెలుసా.?
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
మళ్లీ మోత మోగిస్తున్న బంగారం ధర.! బంగారంతోపాటే వెండి కూడా..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
బ్రిటన్ ఎన్నికల్లో తెలంగాణ వాసి పోటీ.. అంచెలంచెలుగా ఎదిగి..
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి
భారత్ చంద్రుడిపైకి వెళ్తుంటే.. పాక్‌ పిల్లలు మురికి కాల్వల్లో పడి