Mahesh Babu: మరోసారి విలన్‏గా సంజయ్ దత్.. ఈసారి ఏకంగా సూపర్ స్టార్‏నే ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్ ?..

|

Oct 26, 2022 | 7:45 AM

మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో జపాన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Mahesh Babu: మరోసారి విలన్‏గా సంజయ్ దత్.. ఈసారి ఏకంగా సూపర్ స్టార్‏నే ఢీకొట్టనున్న బాలీవుడ్ స్టార్ ?..
Sanjay Dutt, Mahesh Babu
Follow us on

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎస్ఎస్ఎంబీ 28 వర్కింగ్ టైటిల్‏తో రూపొందుతున్న ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ.. తర్వలోనే సెకండ్ షెడ్యూల్ స్టార్ట్ కానుంది. అయితే కొద్ది రోజులుగా ఈ సినిమా గురించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో మరో కథానాయికగా పెళ్లి సందడి ఫేమ్ శ్రీలీల కనిపించనుందని టాక్ వినిపించింది. తాజాగా మరో అప్డేట్ వైరలవుతుంది.

ఈ సినిమాలో విలన్ పాత్ర మరింత పవర్ ఫుల్ ఉంటుందని.. ఈ రోల్ కోసం బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్‏ను తీసుకోవాలని భావిస్తున్నారట మేకర్స్. మహేష్ ను ఢీకొట్టే పాత్ర పవర్ ఫుల్ ఉంటుందని.. ఆరోల్ కు సంజయ్ దత్ అయితేనే న్యాయం జరుగుతుందని భావిస్తున్నారట. త్వరలోనే ఆయనతో చర్చలు జరపనున్నారట. ఇక ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న సంజయ్.. తనకు సౌత్ సినిమాల్లో నటించాలని ఉందని.. అవకాశం వస్తే మరిన్ని చిత్రాలు చేయడానికి సిద్ధంగా ఉన్నానంటూ హింట్ ఇవ్వడంతో ఆయనకు ఆఫర్స్ క్యూ కట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి

ఈ సినిమా తర్వాత మహేష్.. డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం జక్కన్న ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో జపాన్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది వీరిద్దరి కాంబోలో తెరకెక్కే సినిమా రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కానుంది.