ఒకే వేదిక పై మాజీ ప్రేమికులు.. ఇది మాకు కొత్తేమీ కాదన్న హీరో
షాహిద్ కపూర్, నటి కరీనా కపూర్ ఖాన్ ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు వారు గాఢంగా ప్రేమించుకున్నారు. వారు కలిసి నటించిన 'జబ్ వి మెట్' సినిమా సూపర్ హిట్ అయింది. కానీ తరువాతి రోజుల్లో, వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత వారు విడిపోయారు. అదంతా పాత కథ. కానీ ఇప్పుడు సీన్ మారింది.

షాహిద్ కపూర్, హాట్ బ్యూటీ కరీనా కపూర్ ఖాన్ ల ప్రేమకథ అందరికీ తెలిసిందే. ఒకప్పుడు ఈ ఇద్దరూ గాఢంగా ప్రేమించుకున్నారు. వారు కలిసి నటించిన ‘జబ్ వి మెట్’ సినిమా సూపర్ హిట్ అయింది. కానీ తరువాతి రోజుల్లో, వారి మధ్య విభేదాలు తలెత్తాయి. తర్వాత ఈ ఇద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. అదంతా పాత కథ. కొత్త విషయం ఏమిటంటే ఇప్పుడు షాహిద్ కపూర్, కరీనా కపూర్ మళ్ళీ కలుసుకున్నారు. వారు ఓ వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వీరిద్దరినీ కలిసి చూడటం అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది.
బ్రేకప్ తర్వాత కరీనా కపూర్ సైఫ్ అలీ ఖాన్ను వివాహం చేసుకుంది. అదేవిధంగా, షాహిద్ కపూర్ మీరా రాజ్పూర్తో తన వివాహ జీవితాన్ని ప్రారంభించాడు. ఆ విధంగా, కరీనా మరియు షాహిద్ కపూర్ జీవితాలు వేర్వేరు మార్గాల్లో సాగాయి. అయినప్పటికీ, వారిద్దరి మధ్య స్నేహం చెక్కుచెదరకుండా ఉంది. తాజాగా ఈ ఇద్దరూ కలిసి కనిపించిన వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అభిమానులు.
IIFA వేడుక విలేకరుల సమావేశంలో కరీనా కపూర్ ఖాన్ , షాహిద్ కపూర్ వేదికను పంచుకున్నారు. వేదికపైకి రాగానే ఇద్దరూ ఒకరినొకరు కౌగిలించుకున్నారు. వాళ్ళు సంతోషంగా మాట్లాడుతుండగా అందరి కళ్ళు వాళ్ళ పైనే పడ్డాయి. మాజీ ప్రేమికులు ఇలా కనిపించడం చూసి అభిమానులు ఆశ్చర్యపోయారు. విడిపోయినప్పటి నుంచి ఈ ఇద్దరూ కలిసి కనిపించింది చాలా తక్కువ. చాలా కాలం తర్వాత కరీనాను కలవడం ఎలా అనిపించింది అని అడిగినప్పుడు షాహిద్ బదులిచ్చారు. ‘ఇది మాకు కొత్తేమీ కాదు. మేము గతంలోనూ ఓ వేదికపై కలిశాము. మేము తరచుగా ఇక్కడ, అక్కడ కలుస్తాము. అది మాకు చాలా సహజం. “ప్రజలు సంతోషంగా ఉంటే, మేము కూడా సంతోషంగా ఉంటాం” అని షాహిద్ కపూర్ అన్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




