Tollywood: ‘ఘోరమైన పాపం చేశావ్’..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?

తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటిస్తోన్న ఈ హీరోయిన్ తరచూ వివాదాల్లో చిక్కుకుంటోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ మరోసారి వార్తల్లో నిలిచింది. ఈ అందాల తారపై ముస్లింలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఘోరమైన తప్పు చేశావ్ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ హీరోయిన్ ఏం చేసిందంటే?

Tollywood: ఘోరమైన పాపం చేశావ్..టాలీవుడ్ హీరోయిన్‌పై ముస్లింల తీవ్ర ఆగ్రహం.. అసలు ఏం జరిగిందంటే?
Bollywood Actress Nushrat Bharucha

Updated on: Dec 31, 2025 | 7:31 PM

నుష్రత్ బరూచా.. సినిమాలతో పాటు వివాదాల్లోనూ ఈ ముద్దుగుమ్మ పేరు తరచూ వినిపిస్తోంది. గతంలో శివాజీతో కలిసి తాజ్ మహల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా రాణిస్తోంది. ఆ మధ్యన బెల్లం కొండ శ్రీనివాస్ తో కలిసి ఛత్రపతి రీమేక్ లోనూ కథానాయికగా నటించిన నుష్రత్ పై ఇప్పుడు ముస్లిం సమాజం తీవ్రంగా మండిపడుతోంది. నుష్రత్ ఇటీవల మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలోని మహాకల్ ఆలయాన్ని సందర్శించింది. అక్కడి శివుడికి ప్రత్యేక పూజలు కూడా చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. దీంతో ముస్లిం లు నుష్రత్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అధ్యక్షుడు మౌలానా షహబుద్దీన్ రిజ్వీ బర్వేలీ నుష్రత్ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ‘నుష్రత్ భారుచా ఉజ్జయినిలోని మహాకల్ ఆలయానికి వెళ్ళింది. అక్కడ ఆమె శివలింగానికి పూజలు చేసింది. గంధం పూసుకుంది. ఆమె అక్కడి మత సంప్రదాయాలను అనుసరించింది. ఇలాంటి చర్యలు ఇస్లాం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధం. షరియా ప్రకారం, నుష్రత్ ఘోరమైన పాపం చేసింది. ఆమె వెంటనే ముస్లిం సమాజానికి క్షమాపణలు చెప్పాలి. నటి పశ్చాత్తాపం చెంది కల్మా పఠించాలి’ అని మౌలానా డిమాండ్ చేశారు.

అయితే ఈ వివాదంపై నుస్రత్ ఇంకా స్పందించలేదు. అయితే నుష్రత్ ఇలా మహాకాల్ ఆలయాన్ని సందర్శించడం ఇదేమీ మొదటి సారి కాదని తెలుస్తోంది. గతంలోనూ చాలా సార్లు ఇలా వివిధ హిందూ దేవాలయాలను, గుడులను సందర్శించిందని తెలుస్తోంది. అలాగే ఈ విషయంపై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఆలయం, మసీదు లేదా చర్చి అయినా వివిధ ప్రార్థనా స్థలాలలో శాంతిని పొందడాన్ని తాను నమ్ముతానని పేర్కొంది.

ఇవి కూడా చదవండి

  మహాకాల్ ఆలయంలో నుష్రత్ బరూచా..

‘మీకు ఎక్కడ శాంతి లభిస్తే, అది మందిరంలో అయినా, గురుద్వారాలో అయినా, చర్చిలో అయినా మీరు అక్కడికి వెళ్లాలి. నాకు సమయం దొరికితే, రోజుకు ఐదుసార్లు నమాజ్ చేస్తాను. ఒకే దేవుడు ఉన్నాడని, ఆయనతో అనుసంధానం కావడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయని నేను ఎప్పుడూ నమ్ముతాను. నేను ఆ మార్గాలన్నింటినీ అన్వేషించాలనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.