
బుల్లితెరపై అత్యంత పాపులర్ రియాలిటీ షోల్లో బిగ్ బాస్ తెలుగు అని చెప్పవచ్చు. ఈ షో గురించి ఎన్ని విమర్శలు వచ్చినా, వివాదాలు చుట్టుముట్టినా దీని క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదని చెప్పవచ్చు. సీజన్ సీజన్ కు ఈ రియాలిటీ షోకు ఆదరణ మరింత పెరుగుతోంది. కొత్త కంటెస్టెంట్స్, కొత్త టాస్కులతో బుల్లితెర ఆడియెన్స్ కు బోలెడు ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. అయితే బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేసిన కొందరు ఈ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచారు. అలా స్టార్ యాకంర్ ఓ ఇంటర్వ్యూలో ఈ రియాలిటీ షోపై షాకింగ్ కామెంట్స్ చేసింది. పలు సినిమాలు, సీరియల్స్ లో నటించిన ఈ అందాల తార రెండు సార్లు బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లింది. బిగ్ బాస్ మొదటి సీజన్ లో పాల్గొన్న హరితేజ గతేడాది బిగ్ బాస్ సీజన్ 8 లో వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చింది. విజేతగా నిలవకపోయినా తన ఆట, మాట తీరుతో బిగ్ బాస్ ఆడియెన్స్ మనసులు గెల్చుకుంది. అయితే ఈ హౌస్ లో ఏం జరిగిందో తెలియదు కానీ ఈ జన్మలో ఇంకోసారి బిగ్ బాస్ కు వెళ్లనంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది హరితేజ
‘బిగ్ బాస్ మొదటి సీజన్ హైదరాబాద్ లో జరగలేదు. ముంబై సమీపంలో ఉన్న లోనావాలాలో జరిగింది. అడవిలో బిగ్ బాస్ సెట్ వేశారు. రాత్రి అయితే పులుల శబ్దాలు వినిపించేవి. హౌస్ లోకి పాములు కూడా వచ్చేవి. కానీ నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. . ఆ అనుభవాలు భయంకరంగా ఉన్నా, అదే సమయంలో థ్రిల్లింగ్గా అనిపించాయి. ఆ సీజన్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సరదా సంభాషణలు కూడా ఇప్పటికీ గుర్తున్నాయి. అయితే బిగ్ బాస్ సీజన్ 8లో పార్టిసిపేట్ చేసిన తర్వాత నా అభిప్రాయం మారింది. నా ఇమేజ్ చాలా దెబ్బతింది. బయట చాలా నెగటివ్ కామెంట్స్ వచ్చాయి. వాటి వల్ల నేను డిప్రెషన్లోకి వెళ్లాను. తిరిగి కోలుకోవడానికి చాలా సమయం పట్టింది. ఇప్పుడు బిగ్ బాస్పై ఇంట్రెస్ట్ పూర్తిగా పోయింది… కొన్నిసార్లు చిరాగ్గా కూడా అనిపిస్తుంది. అందుకే ఇక మళ్లీ బిగ్ బాస్కు వెళ్లాలనే ఆలోచనే లేదు’ అని చెప్పుకొచ్చింది హరి తేజ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.