నిఖిల్ తాజా చిత్రం ‘అర్జున్ సురవరం’ విడుదల తేదీపై స్పష్టత వచ్చేసింది. మొదట ఈ నెల 29న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకున్నా.. ఎన్నికల హడావిడి ఉండటంతో మే1కి వాయిదా వేశారు.
#ArjunSuravaram will now release on May 1st,2019
Nizam rights bagged by Asian Cinemas Sunil Narang for Rs 4 crore..
Highest in @actor_Nikhil's career in Nizam area
@Itslavanya @SamCSmusic #Tnsanthosh @TagoreMadhu @MovieDynamix pic.twitter.com/vKPKJxOMzk— Suresh Kondi (@V6_Suresh) March 23, 2019
కోలీవుడ్లో విజయం సాధించిన ‘కణిథన్’ రీమేక్గా ‘అర్జున్ సురవరం’ తెరకెక్కింది. మాతృకకు దర్శకత్వం వహించిన టీఎన్ సంతోశ్ రీమేక్ను డైరక్ట్ చేశారు. లావణ్య త్రిపాఠి హీరోయిన్గా నటించింది. ఠాగూర్ మధు సమర్పణలో రాజ్ కుమార్ ఆకెళ్ల, కవియ వేణుగోపాల్ నిర్మించిన ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం అందించాడు. కాగా ఈ మూవీ నైజాం రైట్స్ను రూ.4కోట్లకు అమ్ముడుపోయాయి. ఏషియన్ సినిమాస్ సునీల్ నారంగ్ ఈ మూవీ నైజాం రైట్స్ను సొంతం చేసుకున్నారు. నైజాం హక్కులకు సంబంధించి నిఖిల్ కెరీర్లో ఇది హయ్యెస్ట్ రికార్డు.