Gayatri Bhargavi: కేటుగాళ్లు చేసిన పనికి షాక్ అయిన యాంకర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన గాయత్రి భార్గవి..

|

Aug 13, 2021 | 6:02 AM

సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతోన్నాయి. సెలబ్రెటీల కు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు.

Gayatri Bhargavi: కేటుగాళ్లు చేసిన పనికి షాక్ అయిన యాంకర్.. సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించిన గాయత్రి భార్గవి..
Gayatri
Follow us on

Gayatri Bhargavi: సైబర్ నేరగాళ్ల మోసాలు రోజు రోజుకు ఎక్కువవుతోన్నాయి. సెలబ్రెటీలకు సంబంధించిన సోషల్ మీడియా ఖాతాలను కేటుగాళ్లు హ్యాక్ చేస్తున్నారు. వారి అకౌంట్స్ హ్యాక్ చేసి ఇతరాలను నమ్మించి మోసం చేయడం లేదా అకౌంట్స్‌‌‌‌లో పిచ్చి పిచ్చి పోస్ట్‌‌‌లను పెట్టడం వంటివి చేస్తున్నారు. ఇప్పటికే చాలా మంది సెలబ్రెటీలు ఈ జాదూగాళ్ళ బారిన పడ్డారు. తాజాగా ప్రముఖ యాంకర్, నటి గాయత్రి భార్గవి సోషల్ మీడియా అకౌంట్ ఫేస్ బుక్ హ్యాక్ అయ్యింది. దీంతో ఆమె బుధవారం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన అకౌంట్ ద్వారా వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకర సందేశాలు షేర్ చేయడంతో అలర్ట్ అయిన గాయత్రి పోలీసులను ఆశ్రయించింది. గాయత్రికి పర్సనల్ అకౌంట్ తోపాటు.. అదే పేరుతో ఓ పేజీ కూడా ఉందట.. ఈ రెండు అకౌంట్స్ ను హ్యాకర్స్ హ్యాక్ చేశారని తెలుస్తోంది.

తన అకౌంట్స్ హ్యాకింగ్ కు గురయ్యాయని తెలుసుకున్న గాయత్రి వెంటనే సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఆమె అకౌంట్స్‌‌‌‌ను బ్లాక్ చేశారు. ఈ  సందర్భంగా ఏసీపీ కేవిఎం ప్రసాద్ మాట్లాడుతూ.. ‘సోషల్ మీడియా అకౌంట్స్‌‌‌‌ను తమ ఆధీనంలోకి తీసుకొని కొందరు హ్యాకర్స్ వివిధ మతాలకు సంబంధించిన అభ్యంతరకరమైన సందేశాలను అందులో పోస్ట్ చేస్తున్నారని, సెలబ్రెటీలు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఎప్పటికప్పుడు తమ పాస్‌‌‌‌వర్డ్స్ మారుస్తూ ఉండవల్ల హ్యాకింగ్‌‌‌ను కొంతమేర కంట్రోల్ చేయవచ్చని సూచించారు. యాంకర్ గాయత్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాప్తు కొనసాగుతోందని కేసు వివరాలను తెలియజేశారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

 RRR సెట్స్‌లో రామ్ చరణ్ వైఫ్ ఉపాసన.. మూవీ టీం చూపించిన కేరింగ్‌కు ఫిదా

Viral Photos: సోషల్ మీడియాలో దుమ్మురేపుతున్న DDL బ్యూటీ కూతురు.. తాజాగా వైరల్‌గా మారిన తల్లితో జిమ్‌కు కలిసి వెళ్తున్న ఫోటోలు..