Amrita Rao: మేనేజర్ చేసిన పనికి నా గుండె బద్దలైంది.. షాకింగ్ విషయం తెలిపిన అతిథి మూవీ హీరోయిన్
ప్రీతీ జింత దగ్గరనుంచి మొన్నటి కియారా అద్వానీ వరకు మహేష్ బాబు సినిమాలతో చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో అమృతరావు ఒకరు.
సూపర్ స్టార్ మహేష్ బాబు చాల మంది బాలీవుడ్ ముద్దుగుమ్మలను టాలీవుడ్ కు పరిచయం చేశారు. ప్రీతీ జింత దగ్గరనుంచి మొన్నటి కియారా అద్వానీ వరకు మహేష్ బాబు సినిమాలతో చాలా మంది బాలీవుడ్ బ్యూటీలు టాలీవుడ్ కు పరిచయం అయ్యారు. అలా వచ్చిన వారిలో అమృతరావు ఒకరు. వివాహ్ సినిమాతో అందరి దృష్టిని ఆకర్షించింది అమృతారావ్. ఆ తర్వాత పలు హిందీ సినిమాల్లో నటించి బాలీవుడ్ ప్రేక్షకులకు బాగా చేరువైంది. తెలుగులో మహేశ్బాబు సరసన అతిథి సినిమాలోనూ ఆడిపాడిందీ ముద్దుగుమ్మ. సినిమా కెరీర్లో పీక్స్ ఉండగానే ఆర్జే ఆన్మోల్తో ప్రేమలో పడిన అమృత 2016లో అతనితో కలిసి పెళ్లిపీటలెక్కింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
తాజాగా అమృత రావు ఓ పుస్తకాన్ని రచ్చించింది. ఈ పుస్తకంలో తన అనుభవాలను పంచుకుంది. దీనిలో తన మేనేజర్ కారణంగా ఓ బ్లాక్ బస్టర్ సినిమాను మిస్ చేసుకుందట ఆ విషయాలను ఈ బుక్ లో తెలిపింది.
సల్మాన్ నటించిన వాంటెడ్ సినిమా ఛాన్స్ అమృత మిస్ చేసుకుందట. ‘వాంటెడ్’ చిత్రంలో ఆమెకు హీరోయిన్ ఛాన్స్ వస్తే మేనేజర్ ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టాడు. అయితే ఆ విషయం తనకు చాలా లెట్ గా తెలిసిందట. దాంతో షాక్ తిన్నాను అని తెలిపింది. దాని గురించి తెలిసిన తర్వాత డేట్స్ క్లాష్ అవుతాయని అలా చెప్పను అని అన్నాడట.
https://t.co/1lr8BGQ6aK ? pic.twitter.com/yh6i1thyrL
— AMRITA RAO ?? (@AmritaRao) March 8, 2023