
దేశవ్యాప్తంగా ది కేరళ స్టోరీ సినిమా వివాదం కొనసాగుతూనే ఉంది. ఎక్కడో ఒకచోట ఈ సినిమా పై ఆరోపణలు.. నిరసనలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి .. మే 5న విడుదలైన ఈ సినిమాను కొందరు వ్యతిరేకిస్తుండగా.. బాక్సాఫీస్ వద్ద మాత్రం కాసుల వర్షం కురిపిస్తుంది. వారం రోజుల్లోనే 100 కోట్ల క్లబ్బులో చేరిపోయింది ఈ సినిమా. ప్రస్తుతం ఈ చిత్ర వసూళ్లు రోజు రోజుకీ పెరుగుతున్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ది కేరళ స్టొరీ ఇప్పటికే 220 కోట్ల వరకూ వసూలు చేసిందని తెలుస్తోంది. హార్ట్ ఎటాక్ బ్యూటీ ఆదా శర్మ కథానాయికగా తెరకెక్కిన ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది.
దర్శకుడు సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహానీ, సిద్ధి ఇద్నానీ, సోనియా బలానీ నటించారు. కేరళలో అమాయకులైన అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో మతమార్పిడి చేసి వారిని ఐఎస్ఐఎస్ క్యాంపుల్లో పంపించి దేశ వ్యతిరేకులుగా మార్చారనే కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే ఈ సినిమాపు తీవ్ర వ్యతిరేకత ఎదురైన సంగతి తెలిసిందే. ఓవైపు థియేటర్లలో దూసుకుపోతుంది.
అత్యధిక వసూళ్ల రాబట్టిన లేడీ ఓరియెంటెడ్ చిత్రంగా నిలిచింది ఈ సినిమా. 2023లో ఒక హిందీ చిత్రానికి ఐదవ అత్యధిక ఓపెనర్ గా కూడా ఈ సినిమా నిలిచింది. ఈ సినిమా ఓటీటీ హక్కులను ఇప్పటికే ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ పారమ్ కొనుగోలు చేసింది. జీ5 ఓటీటీ హక్కులను దక్కించుకుంది.