టాలీవుడ్ నుంచి చాలా మంది హీరోయిన్స్ బాలీవుడ్ కు వెళ్లి అక్కడ పేరు తెచ్చుకున్నారు. తెలుగులో సక్సెస్ అయిన హీరోయిన్స్ హిందీలోనూ అదృష్టన్ని పరీక్షించుకుంటున్నారు. అలాంటి వారిలో తాప్సీ ఒకరు. తెలుగులో గ్లామరస్ హీరోయిన్గా పేరు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్లో మాత్రం ఫైర్ బ్రాండ్గా పేరుతెచ్చుకుంది. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన ఝుమ్మందినాదం సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది. ఆతర్వాత తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసింది. అలాగే తమిళ్లోనూ సినిమాలు చేసింది. ప్రస్తుతం తాప్సీ తెలుగులో సినిమాలు తగ్గించింది. పూర్తి ఫోకస్ ఆమె బాలీవుడ్ పైనే పెట్టింది. 2013లో వరుణ్ ధావన్ చిత్రంతో హిందీ చిత్రసీమలోకి అడుగుపెట్టింది.
రెగ్యులర్ హీరోయిన్గా వెలుగొందిన తాప్సీ.. బేబీ, పింక్, ది ఘాజీ అటాక్, బద్లా, మిషన్ మంగళ్, తప్పడ్, హసీనా దిల్రూబా, రష్మీ రాకెట్ చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. హిందీలో హీరోయిన్ సెంట్రిక్ సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను మెప్పించింది. నటి తాప్సీపన్ను హిందీ సినిమాతో అరంగేట్రం చేసినప్పటికీ.. తెలుగులోనూ ఈ అమ్మడి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఇక హిందీలో మిషన్ మంగళ్, చాంత్కి ఆంక్, తప్పట్, హసీన్ దిల్రూబా వంటి చిత్రాలకు మంచి అంచనాలు వచ్చాయి. ముఖ్యంగా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ గా తెరకెక్కిన శభాష్ మిథులో మిథాలీ రాజ్ పాత్రలో నటించి మంచి పేరు తెచ్చుకుంది.
తాజాగా తాప్సీ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేసింది. నేను నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు’ అంటూ నటి తాప్సీ చేసిన బోల్డ్ స్టేట్మెంట్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాప్సీ ఇటీవల ‘పాపరాజీ’ గురించి మాట్లాడింది. ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ‘నేను ప్రముఖ నటిని, పబ్లిక్ ప్రాపర్టీని కాదు. రెండింటికీ చాలా తేడా ఉంది. ‘నో అంటే నో’ అని చెబితే తెరవెనుక ఉన్న మహిళలు అంగీకరించరు. నేను మొదట అమ్మాయిని. ఆ తర్వాత నటిని. నేను ఇలా అంటున్నానుని కొందరు నన్ను తప్పుగా అర్ధం చేసుకోవచ్చు. అలాంటప్పుడు ఎందుకు హీరోయిన్ గా చేస్తున్నావ్ అని కామెంట్స్ చెయ్యొచ్చు. కానీ నటన నాకు నచ్చిన వృత్తి’ అని తెలిపింది తాప్సీ.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.