ఆలసించిన ఆశాభంగం..! ఇన్స్టా సబ్స్క్రిప్షన్ మొదలుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. అలాంటి కంటెంట్ మాత్రమే ఉంటుందట
ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ అంటూ సెలబ్రిటీలు ఇటీవల సరికొత్త ఆదాయ మార్గాన్ని ఎంచుకున్నారు. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ అంటూ గ్లామరస్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ భారీ ఆదాయం ఆర్జిస్తున్నారు. ఇప్పటికే బుల్లితెర సెలబ్రిటీలైన విష్ణు ప్రియ, అనన్య నాగళ్ల, అషు రెడ్డి ఇన్ స్టా గ్రామ్ పెయిడ్ సబ్ స్క్రిప్షన్ ప్రారంభించారు.

ఈ మధ్యకాలంలో ఇన్ స్టాగ్రామ్ సబ్స్క్రిప్షన్ హాట్ టాపిక్ గా మారింది. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తాం అంటూ కొంతమంది ఇన్ స్టా గ్రామ్ లో సబ్స్క్రిప్షన్ పెడుతున్నారు. వారిలో సినీ సెలబ్రెటీలు కూడా ఉన్నారు. సినీ సెలబ్రెటీలు ఇన్ స్టా సబ్స్క్రిప్షన్ పెట్టడం పై పెద్ద రచ్చే జరిగింది. తన ఖాతాలో డబ్బు వేస్తే.. పిచ్చిక్కించే ఫోటోలు పోస్టు చేస్తా.. ఆఫ్ న్యూడ్ ఆఫర్.. ఆలసించిన ఆశాభంగం అంటూ కుర్రాళ్లకు ఆశపెట్టేలా తన ఇన్స్టాలో పోస్టులు పెడుతున్నారు కొందరు సోషల్ మీడియా ఇన్ ఫ్యులెన్సర్లు. సెలబ్రెటీలు కూడా ఇప్పుడు సబ్స్క్రిప్షన్ చేసుకోండి.. ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ఇస్తాం అని చెప్పడంతో నెటిజన్స్ అవాక్ అవుతున్నారు.
ఇది కూడా చదవండి : Actress Sudha: ఆ స్టార్ హీరో నాకు దేవుడితో సమానం.. రెండుసార్లు నా ప్రాణాలు కాపాడాడు.
కాగా మొన్నామధ్య విష్ణు ప్రియా సబ్స్క్రిప్షన్ పెట్టడం ఎక్స్ క్లూజివ్ కంటెంట్ కోసం డబ్బులు కట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి అంటూ ఇన్ స్టాలో సందడి చేసింది. దాంతో అటు సోషల్ మీడియాలో ఇటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ పెద్ద వార్త అయ్యింది. అలాగే ఆతర్వాత హీరోయిన్ అనన్య నాగళ్ల కూడా ఇన్ స్టా గ్రామ్ సబ్స్క్రిప్షన్ మొదలు పెట్టింది. ఆతర్వాత నేను కేవలం దేవుడికి సంబందించిన కంటెంట్ మాత్రమే ఇస్తాను అందుకే ఇన్ స్టా గ్రామ్ సబ్స్క్రిప్షన్ పెట్టా అని చెప్పుకొచ్చింది. ఆతర్వాత అషు రెడ్డి, డింపుల్ హయతి, నేహా శెట్టి కూడా ఇన్ స్టా గ్రామ్ సబ్స్క్రిప్షన్ పెట్టారు. తాజాగా మరో హీరోయిన్ కూడా సబ్స్క్రిప్షన్ పెట్టింది.
ఇది కూడా చదవండి : Prabhas: ప్రభాస్కు ఇష్టమైన హీరోయిన్ ఎవరో తెలుసా.? ఆమె నా క్రష్ అంటున్న రెబల్ స్టార్
ఆమె ఎవరో కాదు అందాల భామ పాయల్ రాజ్ పుత్. ఆర్ఎక్స్ 100 సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి మెప్పించింది. తొలి సినిమాతోనే రొమాంటిక్ సీన్స్ , బోల్డ్ సీన్స్ లో రెచ్చిపోయి నటించింది. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్ లు రాలేదు. దాంతో మెల్లగా అవకాశాలు తగ్గాయి. చివరిగా లెజెండ్ శర్వాణన్ నటించిన లీడర్ అనే సినిమాలో నటించింది. ఇక ఇప్పుడు ఇన్ స్టా గ్రామ్ లో సబ్స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది. నా ఛానల్లో నేను ఎలాంటి కంటెంట్ షేర్ చేయబోతున్నాననే దానిపై చాలా మంది మెసేజ్లు చేస్తున్నారు. నా దగ్గర నుంచి బోల్డ్ కంటెంట్ ఆశించకండి. కేవలం నా జీవితంలో తెరవెనక జరిగిన విషయాలను మాత్రమే అక్కడ చూడండి. అంతకు మించి మరేమీ ఆశించవద్దని చెప్పుకొచ్చింది పాయల్ రాజ్ పుత్.
ఇది కూడా చదవండి : Nagarjuna: నాగార్జునకు విలన్గా ఆ అందాల భామ.. కింగ్ 100వ సినిమా కోసం మాస్టర్ ప్లాన్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




