Prabhas: ప్రభాస్ చాలా స్వీట్.. సాంగ్ వచ్చే టైమ్ చెప్పి మరీ థియేటర్‏కు పంపించాడు.. హంసనందిని కామెంట్స్..

ప్రభాస్ కనీసం 3 నిమిషాలు స్పీచ్ మాట్లాడితే చాలు అంటూ ఇటీవల బాలీవుడ్ బ్యూటీ దీపికా సైతం ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది. ఇక నటీనటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ అందరికీ అందించే భోజనం గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టింది.

Prabhas: ప్రభాస్ చాలా స్వీట్.. సాంగ్ వచ్చే టైమ్ చెప్పి మరీ థియేటర్‏కు పంపించాడు.. హంసనందిని కామెంట్స్..
Prabhas, Hamsa Nandini
Follow us

|

Updated on: Jul 02, 2024 | 2:42 PM

పాన్ ఇండియా బాక్సాఫీస్ కింగ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఇక ఇప్పుడు కల్కి సినిమాతో వరల్డ్ వైడ్ రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాడు. ప్రస్తుతం థియేటర్లలో కల్కి సినిమా భారీ వసూళ్లతో దూసుకుపోతుండగా.. మరోవైపు కల్కి 2 గురించి నెట్టింట చర్చ నడుస్తుంది. ఇదిలా ఉంటే.. తెరపై ప్రభాస్ నటకు.. నిజజీవితంలో డార్లింగ్ వ్యక్తిత్వానికి అసలు సంబంధమే ఉండదు.. సినిమాలో ఎలాంటి పాత్రలోనైనా తనదైన నటనతో అదరగొట్టేస్తాడు. కానీ రియల్ లైఫ్ లో మాత్రం ఇంట్రోవర్ట్. స్టార్ హీరో.. అయినా స్టేజ్ పై అందరి ముందు మాట్లాడాలంటే చాలా సిగ్గుపడిపోతుంటాడు. ప్రభాస్ కనీసం 3 నిమిషాలు స్పీచ్ మాట్లాడితే చాలు అంటూ ఇటీవల బాలీవుడ్ బ్యూటీ దీపికా సైతం ఓ ఈవెంట్లో చెప్పుకొచ్చింది. ఇక నటీనటులు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ కూడా ప్రభాస్ అందరికీ అందించే భోజనం గురించి ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చారు. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ హంసనందిని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటపెట్టింది.

ప్రభాస్, అనుష్క జంటగా నటించిన సినిమా మిర్చి. ఇందులో హంసనందిని ఓ స్పెషల్ సాంగ్ చేసింది. ఈ మూవీని చూడాలంటూ స్వయంగా హంసనందినికి టికెట్ బుక్ చేసి థియేటర్ కు పంపించాడట. “ప్రభాస్ కు చాలా సిగ్గు. మిర్చి తర్వాత మేము ఒక పార్టీలో కలిశాం. అయితే మిర్చి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆడియో రిలీజ్ కు, ఈవెంట్లకు వెళ్లలేదు. వేరే ప్రాజెక్ట్స్ ఉండడం వల్ల సినిమా విడుదలయ్యాక చూడలేదు. మిర్చి సినిమా హిట్ అయిన తర్వాత మరో సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడే ప్రభాస్ ఓ పార్టీలో కలిశాడు. మిర్చి సినిమా గురించి అడగ్గా.. ఇంకా చూడలేదు అని చెప్పాను. దీంతో వెంటనే పక్కనే ఉన్న థియేటర్ బుక్ చేసి.. నేను చేసిన సాంగ్ ఎప్పుడొస్తుంద చెప్పి మరీ వెళ్లాలని చెప్పాడు. దీంతో ఆ సాంగ్ వచ్చిన సమయంలో థియేటర్ కు వెళ్లాను. ప్రభాస్ చాలా స్వీట్ ” అంటూ చెప్పుకొచ్చింది.

హంసనందిని తెలుగులో అనేక చిత్రాల్లో నటించింది. వంశీ అనుమానాస్పదం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన హంసనందిని ఆ తర్వాత పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ గా కనిపించింది. అలాగే సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసి అలరించింది. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడిన హంసనందిని చాలాకాలం పాటు చికిత్స తీసుకుని కోలుకుంది. ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.