
లేడీ కమెడియన్ గా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించారు నటి గీత సింగ్. నవదీప్ హీరోగా నటించిన జై సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఆమె.. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించి మెప్పించింది. తనదైన కామెడీ టైమింగ్, నటనతో జనాలను కడుపుబ్బా నవ్వించింది.ఆ తర్వాత అల్లరి నరేష్ నటించిన కితకితలు సినిమాతో మరింత ఫేమస్ అయ్యింది. ఈ మూవీతో గీతా సింగ్ కు మంచి గుర్తింపు వచ్చింది. అయితే వరుసగా అవకాశాలు వస్తున్న సమయంలోనే గీతా సింగ్ సినిమాలకు దూరమయ్యింది. చాలా కాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంటుంది. ఫ్యామిలీ సమస్యలతో సినిమాలకు దూరమైన ఆమె.. ఇప్పుడు మళ్లీ నటించేందుకు రెడీ అయ్యింది. ఇప్పుడిప్పుడే సినీరంగంలో తిరిగి యాక్టివ్ అవుతుంది. ప్రస్తుతం గీత సింగ్ వరుసగా ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.
ఓ ఇంటర్వ్యూలో గీత సింగ్ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. స్టార్ డైరెక్టర్స్ తనను అవమానించారు అని తెలిపింది గీత సింగ్. అల్లు అర్జున్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సరైనోడు సినిమాకు ఓ మంచి పాత్ర ఉందని ఆమెను పిలిచారట.. ఎంతో అందంతో షూటింగ్ కోసం సెట్స్ కు వెళ్లిన తర్వాత ఆమె చేయాల్సిన పాత్రను మరొకరితో చేయించారట.. పాత్ర ఇస్తా అని చెప్పి తీరా షూటింగ్ కు వెళ్లిన తర్వాత ఆ పాత్ర వేరొకరికి ఇవ్వడం చాలా బాధను కలిగించింది అని తెలిపింది గీత సింగ్. చాలా అవమానంగా ఫీల్ అయ్యాను.. దాన్ని భరించలేక అక్కడి నుంచి ఏడుస్తూ వెళ్ళిపోయా అని తెలిపింది నటి గీత సింగ్.
అలాగే రాజా ది గ్రేట్ సినిమా షూటింగ్ లోనూ తనకు అవమానం జరిగిందని తెలిపింది గీత సింగ్. రాజా ది గ్రేట్ సినిమా కోసం తనను సంప్రదించారని.. నెల రోజులు డేట్స్ కూడా బ్లాక్ చేశారని తెలిపింది గీత సింగ్. దాంతో ఆమె ఇతర సినిమా ఛాన్స్ లు కూడా వదులుకుందట. ఎప్పటికీ షూటింగ్ కోసం పిలవకపోవడంతో ఓ రోజు షూటింగ్ కు వెళ్లి చూడగా మరొక అమ్మాయితో ఆ పాత్ర చేయించేశారట.. అదేంటని దర్శకుడు అనిల్ రావిపూడిని అడిగితే.. నాకు తెలియదు, ఆఫీస్ వాళ్ళు చేశారేమో అని సమాధానం చెప్పారట..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి