Oka Pathakam Prakaram: రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ పూరి తమ్ముడు.. ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడితో సినిమా..

|

Feb 19, 2024 | 6:10 PM

సాయిరాం శంకర్ కెరీర్ ఈమూవీతో టర్న్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు థియేటర్లలో డిజాస్టర్స్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న సాయిరాం శంకర్ ఇప్పుడు ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.

Oka Pathakam Prakaram: రీఎంట్రీ ఇస్తున్న డైరెక్టర్ పూరి తమ్ముడు.. ఇంటర్నేషనల్ అవార్డ్స్ అందుకున్న దర్శకుడితో సినిమా..
Oka Pathakam Prakaram
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనం సృష్టించిన సినిమాల్లో “143 ఐ మిస్ యూ” ఒకటి. 2004లో విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. అప్పట్లో ఈ మూవీలోని సాంగ్స్ సైతం సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పటికీ సోషల్ మీడియాలో ఈ సినిమా సాంగ్స్ వింటూనే ఉంటాం. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఈ మూవీలో ఆయన తమ్ముడు సాయి రాం శంకర్ హీరోగా నటించారు. ఇందులో సమీక్ష, నాగబాబు, బ్రహ్మానందం, కీలకపాత్రలు పోషించారు. సాయిరాం శంకర్ కెరీర్ ఈమూవీతో టర్న్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో వరుస సినిమాలు చేస్తూ తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన నటించిన సినిమాలు థియేటర్లలో డిజాస్టర్స్ కావడంతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. చాలా కాలం గ్యాప్ తీసుకున్న సాయిరాం శంకర్ ఇప్పుడు ‘ఒక పథకం ప్రకారం’ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నాడు. ఇటీవలే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ఇప్పుడు విడుదలకు సిద్ధమయ్యింది.

వినోద్‌ విజయన్‌ ఫిలిమ్స్, విహారి సినిమా హౌజ్‌ బ్యానర్స్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇందులో సాయిరామ్‌ శంకర్, అశీమా నర్వాల్‌, శృతీ సోధిలు హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎన్నో జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకున్న వినోద్‌ విజయన్‌ దర్శకత్వం వహిస్తుండగా.. వినోద్‌ విజయన్, గార్లపాటి రమేష్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. అంతేకాకుండ ఆరుగురు నేషనల్ అవార్డ్ విన్నర్స్ టెక్సీషియన్స్ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారు. ఈ మూవీని మార్చిలో థియేటర్ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఈ చిత్రానికి రాహుల్ రాజ్ సంగీతం అందిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ గోపిసుందర్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాత, దర్శకుడు వినోద్‌ విజయన్ మాట్లాడుతూ.. “ఈ సినిమాను విభిన్నమైన కథాంశంతో నిర్మిస్తున్నాం. థ్రిల్లర్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో సాయిరాం శంకర్ పవర్ ఫుల్ అడ్వకేట్ పాత్రను పోషిస్తున్నారు. అలాగే ఇందులో సముద్రఖని పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఇక గోపిసుందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ మూవీకే హైలైట్ గా నిలుస్తుంది. రాహుల్ రాజ్ అద్భుతమైన రెండు పాటలు అందించారు. ఆ రెండింటికి సిధ్ శ్రీరాం తన గాత్రంతో ప్రాణం పోశారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సాంగ్ “ఒసారిలా రా” మంచి రెస్పాన్స్ వచ్చింది ” అంటూ చెప్పుకొచ్చారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.