
సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్డేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత వెంటనే ఆయన తదుపరి చిత్రం జైలర్ 2లో షూటింగ్ లో నిమగ్నమయ్యారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 2026 ఆఖరులో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఒక వైపు జైలర్ 2 విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రజనీకాంత్ రాబోయే చిత్రం తలైవర్ 173 గురించి అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటోన్న రజనీకాంత్ తన అభిమానులను కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఒక అభిమానిని కలుసుకున్నారు. ఫోన్ చేసి మరి అతనిని ఇంటికి పిలిపించుకున్న సూపర్ స్టార్ ఆ వ్యక్తికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాన . ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికిబంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.
Superstar #Rajinikanth personally called and appreciated a Fan and his family, who have been serving the people by offering 5-rupee parottas in Madurai..❣️ Also Thalaivar gifted him a gold chain..🤝🤩 pic.twitter.com/9OnLnDQHlr
— Laxmi Kanth (@iammoviebuff007) January 25, 2026
Since 1975 The bond between #Rajinikanth and his fans..
Recently a viral video showed a person from madurai who is a diehard fan sells parotta at 5rs at his hotel. Thalaivar gifted gold chainBest moment for a fan ❤️ That’s how the bond between loyal fans and Rajini since 1975 pic.twitter.com/TCzW9oxxm5
— Minnal_Magy (@MagyMagesh1) January 25, 2026
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.