Mahesh Babu: మొదటిసారి స్టేజ్ పైనే స్టెప్పులేసిన మహేష్.. సర్కారు వారి పాట మాస్ సెలబ్రెషన్స్‏లో సూపర్ స్టార్..

|

May 17, 2022 | 6:44 AM

ఓవైపు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట హావా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి.

Mahesh Babu: మొదటిసారి స్టేజ్ పైనే స్టెప్పులేసిన మహేష్.. సర్కారు వారి పాట మాస్ సెలబ్రెషన్స్‏లో సూపర్ స్టార్..
Mahesh Babu 1
Follow us on

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ (Parasuram ).. సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కాంబోలో వచ్చిన సర్కారు వారి పాట బ్లాక్ బస్టర్ హిట్‏గా నిలిచింది. విడుదలైన ఐదు రోజుల్లోనే దాదాపు రూ.150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆల్ టైం రికార్డ్ సృష్టించింది.. ఓవైపు బాక్సాఫీస్ వద్ద సర్కారు వారి పాట హావా కొనసాగుతుండగానే.. మరోవైపు ఈ మూవీ సాంగ్స్ యూట్యూబ్‏ను షేక్ చేస్తున్నాయి. కళావతి…. పెన్నీ సాంగ్స్ మిలియన్ వ్యూస్‏తో దూసుకుపోతుండగా.. మ.. మ.. మాహేష సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. సర్కారు వారి పాట సెన్సెషన్ హిట్ కావడంతో సోమవారం కర్నూలులో సక్సెస్ సెలబ్రెషన్స్ నిర్వహించింది చిత్రయూనిట్. అయితే ఈ వేదికపై మహేష్ బాబు ఫుల్ ఎనర్జీతో స్టెప్పులేశారు..

సర్కారు వారి పాట సక్సెస్ సెలబ్రెషన్స్‎కు అంచనాలకు మించి ఫ్యాన్స్ హాజరు కావడంతో కర్నూల్‏లో జనసందోహం ఏర్పడింది. స్టేజ్ మీద మ మ మహేషా పాటకు తమన్‏ డ్యాన్స్ చేస్తుండగా.. కింది నుంచి మహేష్ ఆకస్మాత్తుగా వచ్చి స్టె్ప్పులేశారు. ఒక్కసారిగా మహేష్ అలా డ్యాన్స్ చేయడంతో అక్కడున్న అభిమానులంతా షాక్ అయ్యారు. మొదటి సారి మహేష్ బాబు ఇలా సక్సెస్ సెలబ్రెషన్స్‏లో స్టేజ్ మీద స్టెప్పులేశారు. దీంతో అభిమానులు సైతం ఫుల్ ఖుషి అయ్యారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది.

ఇవి కూడా చదవండి