జస్ట్ టైం మారింది..ఫన్‌లో మాత్రం నో ఛేంజ్!

|

Sep 27, 2019 | 7:29 PM

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ మ్యాజిక్స్ క్రియేట్ చేస్తాయి. వాటిలో బిగ్గెస్ట్ కాంబో ఏంటి అంటే..రాజమౌళి అండ్ ఎన్టీఆర్‌దే. వీరిద్దరూ ‘స్టూడెంట్ నెం.1’ , ‘సింహాద్రి’ , ‘యమదొంగ’ వంటి టాలీవుడ్ బిగ్గెస్ట్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ జోడి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్, తెలుగు జాతి ఖ్యాతిని ‘బాహుబలి’తో ప్రపంచానికి చాటిన దర్శకుడు కాంబినేషన్ అంటే ఆ కిక్ మాములుగా ఉండదు. కాగా రాజమౌళి మొదటి సినిమా  ‘స్టూడెంట్ […]

జస్ట్ టైం మారింది..ఫన్‌లో మాత్రం నో ఛేంజ్!
Follow us on

టాలీవుడ్‌లో కొన్ని కాంబినేషన్స్ మ్యాజిక్స్ క్రియేట్ చేస్తాయి. వాటిలో బిగ్గెస్ట్ కాంబో ఏంటి అంటే..రాజమౌళి అండ్ ఎన్టీఆర్‌దే. వీరిద్దరూ ‘స్టూడెంట్ నెం.1’ , ‘సింహాద్రి’ , ‘యమదొంగ’ వంటి టాలీవుడ్ బిగ్గెస్ట్‌లు ఇచ్చారు. ప్రస్తుతం ఈ జోడి ‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా కోసం మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఇండియాలోనే ఫైనెస్ట్ యాక్టర్ ఎన్టీఆర్, తెలుగు జాతి ఖ్యాతిని ‘బాహుబలి’తో ప్రపంచానికి చాటిన దర్శకుడు కాంబినేషన్ అంటే ఆ కిక్ మాములుగా ఉండదు.

కాగా రాజమౌళి మొదటి సినిమా  ‘స్టూడెంట్ నెం.1’ విడుదలై నేటికి 18 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా గత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్న ఈ డైరక్టర్.. ఓ ఆసక్తికర ఫొటోను పంచుకున్నాడు. ఆ సినిమా సెట్​లో జూ.ఎన్టీఆర్​తో ఉన్నప్పుడు, ప్రస్తుతం అతడితో ఉన్న ఫొటోను కలిపి సోషల్ మీడియాలో పోస్ట్​ చేశాడు. అందులో ఏం స్పెషాలిటీ ఉంటుంది అనుకున్నారో ఏమో! తాజాగా సేమ్ లొకేషన్ ఉన్న ఫోటోను సేమ్ యాంగిల్ దిగి చేసి రిలీజ్ చేశాడు. దీంతో ఆ ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

” స్టూడెంట్​ నెం.1 విడుదలై నేటికి 18 ఏళ్లు!!. కాకతాళీయంగా మేం ఇప్పుడు రామోజీఫిల్మ్​ సిటీలోనే ఉన్నాం. ఎంతో మారింది. అతడు(జూ.ఎన్టీఆర్) సన్నగా మారాడు. నాకు వయసు పెరిగింది. ఇద్దరి తెలివితేటలు మెరుగయ్యాయి” అని జక్కన్న ట్వీట్ చేశాడు.

కాగా రాజమౌళి ట్వీట్‌కు జూ. ఎన్టీఆర్ స్పందించాడు. ‘అప్పటికి..ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. కానీ సెట్స్‌లో ఫన్ విషయంలో మాత్రం నో ఛేంజస్’ అంటూ ట్వీట్ చేశాడు.