AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: సోషల్ మీడియా ముచ్చట్లు.. ఎన్టీఆర్‌తో హిమజ.. మంటలు రేపుతోన్న నేహ శేటి..

సినిమాలతోపాటు సమానంగా సోషల్ మీడియాలతోనూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. హీరోయిన్ రెగ్యులర్ గా తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది దర్శకుల కంట్లో పడేలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్థూ ఉంటారు. తాజాగా కొంతమంది హీరోయిన్స్ తమ సోషల్ మీడియా పోస్ట్ లతో హీటు పుట్టిస్తున్నారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

Tollywood: సోషల్ మీడియా ముచ్చట్లు.. ఎన్టీఆర్‌తో హిమజ.. మంటలు రేపుతోన్న నేహ శేటి..
Tollywood
Rajeev Rayala
|

Updated on: Sep 15, 2023 | 9:28 AM

Share

సోషల్ మీడియా అనేది ప్రస్తుతం రొటీన్ లైఫ్ లో ఒక భాగం అయిపోయింది. చాలా మంది ఎక్కువ సమయాన్ని సోషల్ మీడియాలోనే గడిపేస్తున్నారు. ఇక సెలబ్రెటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాలతోపాటు సమానంగా సోషల్ మీడియాలతోనూ ప్రేక్షకులను, అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. హీరోయిన్ రెగ్యులర్ గా తమ సినిమా అప్డేట్స్ తో పాటు వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది దర్శకుల కంట్లో పడేలా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్థూ ఉంటారు. తాజాగా కొంతమంది హీరోయిన్స్ తమ సోషల్ మీడియా పోస్ట్ లతో హీటు పుట్టిస్తున్నారు వారు ఎవరో ఇప్పుడు చూద్దాం.!

రీసెంట్ డేస్ ఎక్కువ వినిపిస్తున్న పేర్లలో నేహా శెట్టి ఒకటి. డీజే టిల్లు సినిమా ఈ అమ్మడి కెరీర్ కు కావాల్సినంత మైలేజ్ ఇచ్చింది. ఆ సినిమాలో తన అందంతో నటనతో ఆడియన్స్ ను ఫిదా చేసింది. దాంతో ఈ భామలు వరుసగా అవకాశాలు క్యూకట్టాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో పాటు హాట్ హాట్ ఫోటోలు నెట్టింట షేర్ చేసి హల్ చల్ చేస్తుంది.

సైమా అవార్స్డ్ లో పాల్గొనేందుకు సినీ తారలు దుబాయ్ కు పయనం అవుతున్నారు. ఇప్పటికే చాలా మంది దుబాయ్ కు చేరుకోగా మరికొంతమంది ఇప్పుడు వెళ్తున్నారు. అయితే నటి హిమజ కూడా దుబాయ్ కు వెళ్లారు. అదే సమయంలో విమానంలో ఎన్టీఆర్ కనిపించడంతో ఆయనతో ఫోటో దిగింది హిమజ . ఆఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసి తన ఆనందాన్ని పంచుకుంది.

View this post on Instagram

A post shared by Himaja💫 (@itshimaja)

డైనమిక్ డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ముద్దుగుమ్మ అనన్య పాండే. బాలీవుడ్ లో పలు సినిమాల్లో నటించిన ఈ చిన్నది తెలుగులో మాత్రం సాలిడ్ హిట్ అందుకోలేకపోయింది. లైగర్ సినిమా బెడిసికొట్టడంతో తిరిగి బాలీవుడ్ కు చెక్కేసింది. సోషల్ మీడియాలో అనన్య చాలా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ షేర్ చేసిన ఫోటో వైరల్ గా మారింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.