బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..

Meelo Evaru Kotishwarulu:  మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయమే.

బుల్లితెరపై మరోసారి అలరించనున్న ఎన్టీఆర్.. ఎవరు మీలో కోటిశ్వరులు ప్రోమో రిలీజ్ చేసిన యంగ్ టైగర్..
Follow us

|

Updated on: Mar 13, 2021 | 11:40 AM

Meelo Evaru Kotishwarulu:  మా టీవీలో వచ్చే మీలో ఎవరు కోటీశ్వరుడు ప్రోగ్రాం ఎంత సక్సెస్ అయిందో అందరికి తెలిసిన విషయమే. హిందీలో అమితాబ్ హోస్ట్ గా ప్రసారమయ్యే.. ‘కౌన్ బనేగా కరోడ్ పతి’ తెలుగు వెర్షన్‌గా ఈ ప్రోగ్రాం ప్రారంభించారు. చాలామంది ఈ ప్రోగ్రాంలో పాల్గొని బహుమతులను కూడా గెలుచుకున్నారు. ఇటీవలే దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ జెమినీ టీవీ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే.

`ఎవరు మీలో కోటీశ్వరులు. మీ జీవితాలని మార్చే గేమ్ షో , మీ ఆశలని నిజం చేసే గేమ్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు. త్వరలో మీ జెమినీ టీవీ లో రాబోతుంది సిద్ధంగా ఉండండి` అని జెమినీ టీవీ ట్విట్టర్‌ ద్వారా కొద్ది రోజుల క్రితం ప్రకటించింది. ఇందులో విశేషం ఏంటంటే గతంలో స్టార్‌ మాలో ప్రసారమైన ఈ షో హక్కును జెమినీ టీవీ దక్కించుకోవడం. గతంలో నాగార్జున, చిరంజీవి ఈ షోకి హోస్ట్ లుగా వ్యవరించారు. ఇప్పుడు ఎన్టీఆర్‌ హోస్ట్‌గా నిర్వహించబోతున్నారు. ఈ షోలో చిన్న చిన్న మార్పులతో ఈ రియాలిటీ షో ప్రారంభం కాబోతుంది. ఇప్పటికే ఎన్టీఆర్‌పై ప్రోమోని షూట్‌ చేశారు. దీనికి త్రివిక్రమ్‌ దర్శకత్వం వహించారు. త్వరలో కంటెస్టెంట్స్ ని ఎంపిక చేయబోతున్నారు.

ఇదిలా ఉంటే.. రెండో సారి ఎన్టీఆర్‌ టీవీ షోలో మెరవబోతున్నారు. ఇప్పటికే ఆయన `బిగ్‌బాస్‌` మొదటి సీజన్‌కి హోస్ట్ గా చేశారు. ఇప్పుడు ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. ఈ షో కోసం ఎన్టీఆర్‌ భారీగానే రెమ్యూనరేషన్‌ తీసుకోబోతున్నాడట. ఇదిలా ఉంటే దాదాపు 120 దేశాల్లో ఈ షో విజయవంతం కావడం విశేషం. మొదటి మూడు సీజన్లకి నాగార్జున హోస్ట్ చేయగా, నాల్గో సీజన్‌కి చిరంజీవి హోస్ట్ గా వ్యవహరించారు. ఇప్పుడు ఐదో సీజన్‌కి ఎన్టీఆర్‌ హోస్ట్. శనివారం ఈ షో ప్రోమో విడుదల చేశారు. అలాగే ఈ షోకు సంబంధించి ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నారు మేకర్స్. టీవీ9 లైవ్‏లో ప్రత్యే్క్షంగా వీక్షించండి.

Also Read:

Indian Idol: ఇప్పటివరకు ఇండియన్ ఐడల్ ప్రోగ్రామ్‎లో సంచలనం సృష్టించిన తెలుగు సింగర్స్ వీళ్ళే..