ఇటీవలే ఎన్టీఆర్ బయోపిక్ ద్వారా మిశ్రమ ఫలితాలు అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ..ఎలక్షన్స్ వల్ల కాస్త గ్యాప్ ఇచ్చి మళ్లీ మేకప్ వేసేకునేందుకు సిద్దమవుతున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని వార్తలు వచ్చినప్పటికీ అది నిజం కాలేదు. చివరకు ఆయన తమిళ దర్శకుడు కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సి. కళ్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే ఈ మూవీలో బాలకృష్ణ సరసన ఇద్దరు హీరోయిన్లకు ఛాన్స్ ఉందట. ఒక మొయిన్ హీరోయిన్ కోసం ఒక టాప్ స్టార్ను ట్రై చేస్తే.. ఆమె డేట్లు కుదరకపోవడంతోొ.. శ్రియ శరణ్కి మరో ఛాన్స్ ఇవ్వాలని టీం భావించింది. గతంలో శ్రీయ, బాలయ్య కాంబోలో వచ్చిన మూడు సినిమాల్లో ఈ జంటను చూసి నందమూరి అభిమానులు మురిసిపోయారు కాబట్టి నాలుగోసారి కూడా ఈ జంటను తెరపైకి తీసుకురావాలని డిసైడ్ అయ్యారట.