ముందుగానే రానున్న సూపర్ స్టార్

|

Nov 23, 2019 | 6:30 PM

ఒక సినిమా పోస్టర్ రిలీజవుతే, మరో సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది..ఒక సినిమా టీజర్ రిలీజయితే, మరో సినిమా పాట రిలీజయింది. ఇలా ఒకదానితో మరోటి పోటీపడుతూ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కు సిద్ధమయ్యాయి.. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రెండూ కూడా జనవరి 12న విడుడల చేస్తున్నట్టు […]

ముందుగానే రానున్న సూపర్ స్టార్
Follow us on

ఒక సినిమా పోస్టర్ రిలీజవుతే, మరో సినిమా ఫస్ట్ లుక్ రిలీజయింది..ఒక సినిమా టీజర్ రిలీజయితే, మరో సినిమా పాట రిలీజయింది. ఇలా ఒకదానితో మరోటి పోటీపడుతూ రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ కు సిద్ధమయ్యాయి.. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సంక్రాంతికి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా వస్తోన్న ‘సరిలేరు నీకెవ్వరు’, అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురములో’ రెండూ కూడా జనవరి 12న విడుడల చేస్తున్నట్టు ఇప్పటికే తెలిపాయి ఆ సినిమా నిర్మాణ సంస్థలు.. అయితే, ఇద్దరు టాప్ హీరోల సినిమాలు ఒకేరోజున విడుదల అవ్వడం సరికాదని, దాని ప్రభావం రెండు సినిమాల ఓపెనింగ్స్ పై పడి నష్టాలు వాటిల్లుతాయని చాలా మంది మూవీ ఎక్స్ పర్ట్స్ సూచించారట.. దీంతో ఇరు సినిమాల నిర్మాతలు దీనిపై చర్చించి ఓ పెద్ద నిర్ణయమే తీసుకున్నారు..

ఈ చర్ఛలు ఫలించి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం విడుదల తేదీని మార్చుకున్నట్టు తెలుస్తోంది .జనవరి 12న అనుకున్న రోజుకంటే ఒక రోజు ముందుగానే అంటే 11న ఈ సినిమా విడుదలవుతోంది. ఇక ‘అల… వైకుంఠపురములో…’ ముందు ప్రకటించినట్టుగానే జనవరి 12న థియేటర్లలోకి రానుంది.