అందాల ముద్దుగుమ్మ అనుపమా పరమేశ్వరన్ నటించిన తాజా చిత్రం ‘రాక్షసుడు’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో అనుపమా.. బెల్లంకొండ శ్రీనివాస్కి జోడీగా.. టీచర్ పాత్రలో నటించిన విషయం తెలిసిందే. కాగా.. ఈ సినిమా ప్రమోషన్స్లో భాగంగా మీడియాతో ముచ్చటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలోని రామలక్ష్మి పాత్ర గురించి నన్ను అడిగారని.. కానీ.. అప్పుడు నాకున్న కమిట్మెంట్స్ వల్ల సినిమా చేయలేకపోయిందని చెప్పింది. అలాగే.. ఆ సినిమా వదులుకున్నందుకు ఇప్పటికీ.. ఫీల్ అవుతున్నానని తెలిపింది. అయినా.. ఒకవేళ నేను ‘రామలక్ష్మీ’ పాత్ర చేసినా.. సమంత చేసినంత గొప్పగా నేను చేసివుండక పోవచ్చని తెలిపింది. నాకంటే ఆ పాత్రికి సమంతనే కరెక్ట్ అనుకుంటూ ఉంటానని చెప్పుకొచ్చింది అనుపమా పరమేశ్వరన్.