లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నాక విడుదలైన ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నాడు సాయి ధరమ్ తేజ్. ఈ సినిమాతో రాబోయే సినిమాలకు ఊరట కలిగించాడు ఈ యంగ్ హీరో. తాజాగా ఈ హీరో మరో సినిమాకు ఓకే చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆ సినిమాకు సంబంధించిన మోషన్ పోస్టర్ను జనవరి 25న విడుదల చేయనున్నామని చిత్రయూనిట్ ప్రకటించింది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ పోస్టర్ను విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో కార్ట్ లాంటి రథాన్ని లాగుతున్న కీలు గుర్రాలతో ఆసక్తిని రేపుతుంది. కుంకుమ పువ్వు రంగు, తెల్ల జెండాలతో కూడిన రథం ఇందులో కనిపిస్తోంది. ఈ పోస్టర్ చూస్తుంటే చారిత్రాత్మక కథతో రానున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో హీరోయిన్గా ఐశ్వర్య రాజేష్ నటిస్తుండగా.. జగపతిబాబు, రమ్య కృష్మ కీలక పాత్రలలో నటిస్తున్నారు. మణిశర్మ సంగీతాన్ని అందిస్తుండగా.. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరికొత్త లుక్లో కనిపించనున్నట్లుగా తెలుస్తోంది.
These horses? and the chariot represents..?
KEEP GUESSING..!!Revealing the Title & Motion poster of Supreme Hero @IamSaiDharamTej & @devakatta‘s #SDT14 tomorrow at 5pm.#RevealingSDT14@aishu_dil @IamJagguBhai @meramyakrishnan #ManiSharma @bkrsatish @JBEnt_Offl @ZeeStudios_ pic.twitter.com/KnrdMf7Cu0
— BARaju (@baraju_SuperHit) January 24, 2021