అనుష్క కోసం మరోసారి విలన్‌గా..?

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ‘సైలెన్స్’ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుండగా.. ప్రధాన తారాగణం మొత్తం త్వరలో అక్కడకు వెళ్లనుంది. కాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మూవీ యూనిట్ రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథను విన్న రానా.. ఈ మూవీలో నటించేందుకు ఓకే […]

అనుష్క కోసం మరోసారి విలన్‌గా..?
Follow us

| Edited By:

Updated on: Feb 18, 2019 | 1:10 PM

అనుష్క, మాధవన్ ప్రధాన పాత్రలలో ‘వస్తాడు నా రాజు’ ఫేమ్ హేమంత్ మధుకర్ ‘సైలెన్స్’ అనే మూవీని తెరకెక్కించనున్నాడు. యాక్షన్ థ్రిల్లర్‌తో తెరకెక్కబోతున్న ఈ చిత్రం వచ్చే నెల నుంచి సెట్స్ మీదకు వెళ్లనుంది. కథానుగుణంగా అధిక భాగం షూటింగ్ అమెరికాలో జరగనుండగా.. ప్రధాన తారాగణం మొత్తం త్వరలో అక్కడకు వెళ్లనుంది.

కాగా ఈ చిత్రంలో విలన్ పాత్ర కోసం మూవీ యూనిట్ రానాను సంప్రదించినట్లు తెలుస్తోంది. కథను విన్న రానా.. ఈ మూవీలో నటించేందుకు ఓకే చెప్పినట్లు కూడా టాక్. ఒకవేళ ఇదే నిజమైతే సినిమాకు మరింత ఆకర్షణ తోడయ్యే అవకాశం ఉంది. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, కోన ఫిల్మ్ కార్పోరేషన్ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతాన్ని అందించనున్నాడు. కాగా రానా, అనుష్క ఇంతకుముందు రెండు చిత్రాల్లో నటించారు. ‘రుద్రమదేవి’లో అనుష్క జోడీగా రానా నటించగా.. ‘బాహుబలి’లో విలన్‌గా కనిపించిన విషయం తెలిసిందే.