
దగ్గుబాటి రానా, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో దర్శకుడు వేణు ఉడుగుల తెరకెక్కించనున్న పీరియాడికల్ చిత్రం ‘విరాటపర్వం’. ఈ సినిమా ఇవాళ ఉదయం 10.30 నిమిషాలకు రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలుతో ప్రారంభమైంది. దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు ప్రత్యేక అతిధులుగా ఈ కార్యక్రమానికి విచ్చేశారు.
టబు, మురళీ శర్మ, ప్రియమణి కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్.ఎల్.వి సినిమాస్, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.