‘ఇస్మార్ట్ శంకర్’కు.. వర్మ స్మార్ట్ పబ్లిసిటీ!

| Edited By: Pardhasaradhi Peri

Jul 22, 2019 | 4:15 PM

‘ఇస్మార్ట్ శంకర్’… ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఇలా ఉండగా పూరి జగన్నాధ్‌కు గురువైన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమా చూసే క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ రోడ్లపై హంగామా చేసిన […]

ఇస్మార్ట్ శంకర్కు.. వర్మ స్మార్ట్ పబ్లిసిటీ!
Follow us on

‘ఇస్మార్ట్ శంకర్’… ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరకెక్కించిన ఈ చిత్రం గతవారం విడుదలై బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి వసూళ్లు రాబడుతోంది. నిధి అగర్వాల్, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటించిన ఈ మూవీని పూరి జగన్నాధ్, ఛార్మి కలిసి సంయుక్తంగా నిర్మించారు. ఇది ఇలా ఉండగా పూరి జగన్నాధ్‌కు గురువైన రామ్ గోపాల్ వర్మ.. ఈ సినిమా చూసే క్రమంలో రెండు రోజుల క్రితం హైదరాబాద్ రోడ్లపై హంగామా చేసిన సంగతి తెలిసిందే. సినిమా హిట్టా. ఫట్టా అనేది పక్కన పెడితే.. చిత్ర యూనిట్ కంటే ఎక్కువగా రామ్ గోపాల్ వర్మ పిచ్చోడిలా సందడి చేశాడు.

మరోవైపు రామ్ గోపాల్ వర్మ ఏది చేసినా సంచలనంగానే ఉంటుందని అందరికి తెలిసిన విషయమే. అది వివాదమా.. విమర్శా.. లేక మరో కారణం ఏదైనా ఆయన సృష్టించే అలజడితో భారీ పబ్లిసిటీ రావడం ఖాయం. అందులో భాగంగానే ప్లాప్స్‌లో ఉన్న తన శిష్యుడు పూరి జగన్నాధ్‌ను తనదైన వెరైటీ పబ్లిసిటీతో వర్మ ఆదుకుంటున్నాడని ఇన్‌సైడ్ టాక్. తాజాగా బైక్‌పై హైదరాబాద్ రోడ్ల మీద ట్రిపుల్ రైడింగ్, జరిమానా ఇదంతా ఆ కోవలోదే అని అంటున్నారు సినీ జనాలు. ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమా పబ్లిసిటీని వర్మ స్మార్ట్‌గా చేస్తున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు.