AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిరుకు ఝలక్‌ ఇచ్చిన రాజశేఖర్..!

ఈ ఏడాది జనవరిలో మా డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ చేసిన రచ్చను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడే సమయంలో పలుమార్లు అడ్డుపడ్డారు రాజశేఖర్.

చిరుకు ఝలక్‌ ఇచ్చిన రాజశేఖర్..!
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Feb 27, 2020 | 6:28 PM

Share

ఈ ఏడాది జనవరిలో మా డైరీ ఆవిష్కరణలో రాజశేఖర్ చేసిన రచ్చను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడే సమయంలో పలుమార్లు అడ్డుపడ్డారు రాజశేఖర్. అంతేకాదు ఒకానొక సమయంలో ఆయన నుంచి మైక్ లాక్కునేందుకు కూడా ప్రయత్నించారు. దీంతో అసహనానికి గురైన చిరు, సభావేదికగానే రాజశేఖర్‌పై మండిపడ్డారు. అంతేకాదు అక్కడున్న మిగిలిన ప్రముఖులు కూడా ఈ చర్యను ఖండించారు. ఇక ఈ సంఘటనపై క్రమశిక్షణా కమిటీని కూడా ఏర్పాటు చేసింది మా. అయితే అదే రోజే మా ఎగ్జిగ్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవికి రాజశేఖర్ రాజీనామా చేశారు. ఇది ముగిసి దాదాపు రెండు నెలలు పూర్తి అవుతుండగా.. తాజాగా చిరును రాజశేఖర్ మరోసారి టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది. ప్రత్యక్షంగా కాకపోయినా, పరోక్షంగా రాజశేఖర్, చిరుపై కామెంట్లు చేసినట్లు కొందరు అంటున్నారు.

అసలు విషయంలోకి వెళ్తే.. రాజశేఖర్ ‘అర్జున’ అనే చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. గతేడాదే విడుదల కావాల్సిన ఈ మూవీ కొన్ని కారణాల వలన ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ మూవీ ట్రైలర్‌ ఇటీవల విడుదలైంది. అందులో ‘‘పార్టీ ఓపెన్ చేయగానే టికెట్లు అమ్ముకొని, పని అయిపోయాక పార్టీనే అమ్ముకోవడానికి కాదురా పెట్టింది ఈ పార్టీ’’ అన్న డైలాగ్ ఉంది. దీంతో ఆ డైలాగ్‌ చిరును ఉద్దేశించి పెట్టిందేనని సోషల్ మీడియాలో కామెంట్లు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో ఈ డైలాగ్‌ ఎవ్వరినీ ఉద్దేశించి పెట్టారో  దర్శకుడు, హీరోకే తెలియాలి.