Pushpa Movie: అల్లు అర్జున్ ‘పుష్ప’ సినిమాపై మరో గాసిప్.. షూటింగ్ కోసం అక్కడకు వెళ్ళనున్న చిత్రయూనిట్ ?
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం 'పుష్ప'. ఇందులో రష్మిక మంధన హీరోయిన్గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ డైరెక్షన్లో రూపొందుతున్న చిత్రం ‘పుష్ప’. ఇందులో రష్మిక మంధన హీరోయిన్గా నటిస్తుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో రాబోతున్న ఈ సినిమా షూటింగ్ పై కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ తూర్పు గోదావరి జిల్లాలోని మారేడుపల్లి అడవులలో జరుగుతుంది. ఇక ఈ షూటింగ్ అనంతరం పుష్ప టీం ఫారిన్ వెళ్ళనున్నట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమా చిత్రీకరణపై మరో వార్త ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది. ఫిబ్రవరి మొదటి వారంలో మారెడుపల్లి అడవులలో ఈ మూవీ షూటింగ్ పూర్తికానుంది. దీని తర్వాత తదుపరి షెడ్యూల్ చిత్రీకరణ కోసం పుష్ప టీం కేరళ వెళ్ళనున్నట్లు సమాచారం.
కేరళలో రెండవ షెడ్యుల్ చిత్రీకరణ పూర్తిచేయాని భావిస్తున్నారట మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ పూర్తి కావాల్సి ఉంది. కానీ లాక్ డౌన్ అనంతరం చిత్రబృందంలో కొత్త మందికి కరోనా సోకడంతో కొన్ని రోజులు షూటింగ్ వాయిదా పడింది. ఇటివలే తిరిగి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ఈ సినిమాను కేవలం ఐదు భాషల్లోనే కాకుండా పాన్ ఇండియా లెవల్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.
Also Read: