రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా

| Edited By:

Nov 02, 2019 | 3:22 PM

మహేష్ ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా ఇచ్చేశాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఆయన ఊరించాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అసలు ఆ నిర్మాత ఏం చెప్పాడు..? మహేష్ ఫ్యాన్స్‌కు ఏ ట్రీట్ ఇవ్వబోతున్నాడు..? అనుకుంటున్నారా..? మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న […]

రంగంలోకి దిగిన నిర్మాత.. మహేష్ ఫ్యాన్స్‌కు భరోసా
Follow us on

మహేష్ ఫ్యాన్స్‌కు నిర్మాత భరోసా ఇచ్చేశాడు. మీ అందరూ సిద్ధంగా ఉండండి అంటూ అభిమానులను ఆయన ఊరించాడు. ఇక ఆయన ఇచ్చిన ఉత్సాహంతో ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఫుల్ ఖుషీలో ఉన్నారు. అసలు ఆ నిర్మాత ఏం చెప్పాడు..? మహేష్ ఫ్యాన్స్‌కు ఏ ట్రీట్ ఇవ్వబోతున్నాడు..? అనుకుంటున్నారా..?

మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘సరిలేరు నీకెవ్వరు’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక క్రేజీ కాంబోగా తెరకెక్కుతోన్న ఈ సినిమాపై అభిమానులు చాలా అంచనాలను పెట్టుకున్నారు. అయితే ఇటీవల ఈ చిత్రం పై వస్తోన్న వార్తలు మహేష్ అభిమానులను కాస్త కలవరపాటుకు గురిచేశాయి. ఈ సినిమా పాటల విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడికి, సంగీత దర్శకుడు దేవీ శ్రీ ప్రసాద్‌కు మనస్ఫర్థలు వచ్చాయని.. ఈ మూవీ ఆల్బమ్‌పై దర్శకుడు అసంతృప్తిగా ఉన్నాడని వార్తలు వచ్చాయి. మరోవైపు బన్నీ నటిస్తోన్న ‘అల వైకుంఠపురం’లో చిత్రం కూడా మహేష్ మూవీతో పోటీ పడనుండగా.. ఇప్పటికే వారు ప్రమోషన్లలో దూసుకుపోతూ.. సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఇలాంటి సమయంలో సరిలేరు నీకెవ్వరు టీమ్ సైలెంట్‌గా ఉండటంతో మహేష్ ఫ్యాన్స్‌ కాస్త నిరాశకు లోనయ్యారు. ఇక వారందరినీ కూల్‌ చేయడం కోసం ఈ చిత్ర నిర్మాతల్లో ఒకరైన అనిల్ సుంకర రంగంలోకి దిగారు.

‘‘సరిలేరు నీకెవ్వరు కోసం దేవీ శ్రీ ప్రసాద్ చేసిన మాస్ సాంగ్‌ను విన్నాను. ఆ పాటకు కేక అనేది చిన్న పదం అవుతుంది. దేవీ తన ప్రామిస్‌ను నిలబెట్టుకున్నాడు. మహేష్ అభిమానులకు, ప్రేక్షకులకు ఈ పాట మాస్ ట్రీట్‌ను ఇవ్వబోతోంది. రాక్‌స్టార్, అనిల్ రావిపూడికి చాలా థ్యాంక్స్. అభిమానులకు ఈ ఆల్బమ్ కచ్చితంగా నచ్చుతుంది’’ అని అనిల్ సుంకర ట్వీట్ చేశాడు. ఈ సందర్భంగా సినిమా ప్రారంభోత్సవంలో దేవీ మాట్లాడిన వీడియోను.. అతడితో తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు.

కాగా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరులో మహేష్ ఆర్మీ మేజర్ పాత్రలో నటిస్తున్నాడు. అతడి సరసన రష్మిక నటించగా.. విజయశాంతి, ప్రకాష్ రాజ్, రాజేంద్ర ప్రసాద్, సంగీత, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్, సుబ్బరాజు తదితరులు కీలక పాత్రలలో కనిపించనున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.