Saina Biopic In OTT : కరోనా ఎఫెక్ట్ తో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ ఆలస్యం.. ఓటీటీ వైపు చూస్తున్న నిర్మాత

గత కొంతకాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో క్రీడాకారుల జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మేరీకోమ్, ధోని, సచిన్, మిల్కా సింగ్ వంటి అనేకమంది..

Saina Biopic In OTT :  కరోనా ఎఫెక్ట్ తో సైనా నెహ్వాల్ బయోపిక్ రిలీజ్ ఆలస్యం.. ఓటీటీ వైపు చూస్తున్న నిర్మాత
Follow us

|

Updated on: Jan 28, 2021 | 10:41 AM

Saina Biopic In OTT : గత కొంతకాలంగా బాలీవుడ్‌లో బయోపిక్‌లు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తున్నాయి. దీంతో క్రీడాకారుల జీవితాన్ని వెండి తెరపై ఆవిష్కరించడానికి నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు. మేరీకోమ్, ధోని, సచిన్, మిల్కా సింగ్ వంటి అనేకమంది క్రీడాకారుల జీవితాలు సినిమాలుగా తెరక్కెక్కాయి.. సక్సెస్ అందుకున్నాయి. తాజాగా మరో క్రీడాకారిణి జీవితం వెండి తెరపై ఆవిష్కృతం కానున్నది.

ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా బయోపిక్ తెరకెక్కుతుంది. ఈ సినిమాలో సైనా నెహ్వాల్ పాత్రలో పరిణితీ చోప్రా నటిస్తోంది. అమోల్ గుప్తా దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని టీ సిరీస్ అధినేత భూషణ్ కుమార్ నిర్మిస్తున్నాడు. సైనా గా నటించడం కోసం పరిణితీ చోప్రా చాలా కష్టపడినట్లు తెలుస్తోంది.. బాడ్మింటన్ ను నేర్చుకుంది. లుక్‌లో కూడా సైనానే తలపించేలా ఉంది. ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కరోనా కారణంతో వాయిదా పడింది. అయితే తాజాగా ఈ సినిమాను థియేటర్స్ ను రిలీజ్ చేయడానికి చిత్ర నిర్మాత ఇష్టపడడం లేదని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో థియేటర్స్ లో ప్రేక్షకులను అనుమతించడం లేదు కనుక సినిమా రిలీజ్ కోసం సరైన సమయంలో చిత్ర బృందం ఎదురుచూస్తుంది బీ టౌన్ టాక్.. ఇక మరోవైపు ఈ బయోపిక్ ను ఓటిటీ లో రిలీజ్ చేయడానికి నిర్మాత ఆసక్తి చూపిస్తున్నారని బాలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది.

Also Read: దేశరాజధాని ఢిల్లీ లో తగ్గుముఖం పట్టిన కరోనా.. 9నెలల తర్వాత వందలోపే కేసులు నమోదు