అన్నను ఫాలో అవుతున్న యంగ్ హీరో.. మొదటిసినిమా కంటే ముందే ప్రేక్షకుల ముందుకు రెండో సినిమా.?
మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. 'ఉప్పెన' సినిమాతో ఈ కుర్రహీరో పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది.

మెగా ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న మరో హీరో వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’ సినిమాతో ఈ కుర్రహీరో పరిచయం కాబోతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ లో నూతన దర్శకుడు బుచ్చిబాబు డైరెక్షన్లో ఈ సినిమా తెరకెక్కింది. ఈ మూవీలో కృతి శట్టి హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. లాక్ డౌన్ సమయంలో ఈ మూవీని ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారంటూ వార్తలు వచ్చాయి. కానీ మేకర్స్ మాత్రం ఎట్టిపరిస్థితుల్లో సినిమాను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక ఈ సినిమా రిలీజ్ గ్యాప్ లోనే మరో సినిమా చేసాడు వైష్ణవ్ తేజ్. క్రిష్ దర్శకత్వంలో ఓ గ్రామీణ నేపధ్య కథతో సినిమా చేసాడు వైష్ణవ్. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ షూటింగ్ కూడా పూర్తయ్యి విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు ‘కొండపోలం’ అనే ఇంట్రస్టింగ్ టైటిల్ ను అనుకుంటున్నారు. అయితే ఉప్పెన సినిమా కంటే ముందే ‘కొండపోలం’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ‘ఉప్పెన’ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేయాలనీ చూస్తున్నారట మేకర్స్ . దాంతో ఈలోగా ‘కొండపోలం’ సినిమాను రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. అయితే ‘కొండపోలం’సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేయనున్నారని తెలుస్తుంది.. మరి ఈ వార్తల్లో నిజమెంత అన్నది తెలియాల్సి ఉంది. ఇక సాయి ధరమ్ తేజ్ విషయంలోనూ ఇలానే జరిగింది. మొదటిసినిమా ‘రేయ్’ కంటే ముందు రెండో సినిమా ‘పిల్లనువ్వులేని జీవితం’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.




