
ఇటీవల కాలంలో ఓటీటీలో హారర్, సస్పెన్స్ , మిస్టరీ థ్రిల్లర్ సినిమాలు ఎక్కువగా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మలయాళంలో గత రెండేళ్ల క్రితం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ఓ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఎప్పుడో రెండేళ్ల కిందట అంటే జూన్ 2023లో థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు ఓటీటీ మూవీ లవర్స్ ముందుకు రాబోతుంది. అదే పెండులమ్. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ లో ఈ సినిమా తెలుగులో స్ట్రీమింగ్ కానుంది. మే 22 నుంచి ఈ మూవీ అందుబాటులోకి రానుందని అధికారికంగా ప్రకటించారు.
“మీ కలలు మీకు ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే ఎలా ఉంటుంది.. ? అసలు నిజమేదో, భ్రమేదో తెలుసుకోలేని ఓ గ్రిప్పింగ్ మిస్టరీ థ్రిల్లర్ మూవీని చూసేందుకు సిద్ధంగా ఉండండి. పెండులమ్ తెలుగులో మే 22 నుంచి ప్రీమియర్ కానుంది. కేవలం ఈటీవీ విన్ లో” అనే క్యాప్షన్ తో ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ అనౌన్స్ చేశారు మేకర్స్. రెజిన్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ బాబు, అనుమోల్, ప్రకాష్ బారేలాంటి తదితరులు కీలకపాత్రలు పోషించారు.
డాక్టర్ మహేష్ నారాయణన్ అనే వ్యక్తి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుంది. తన జీవితంలో జరిగిన ఓ అసాధారణ ఘటన గురించి తెలుసుకోవాలని అతడు చేసే ప్రయత్నమే ఈ సినిమా. కేవలం 1 గంట 46 నిమిషాల వ్యవధి ఉన్న ఈ సినిమా ఆద్యంతం ఉత్కంఠతో సాగుతుంది. థియేటర్లలో మంచి విజయాన్ని అందుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది.
What if your dreams are trying to tell you something…?
Get ready to witness a gripping mystery thriller that blurs the lines between reality and illusion!#Pendulum
Premiering in Telugu – May 22
Only on @ETVWIN app pic.twitter.com/U7aGyhQLgh— ETV Win (@etvwin) May 20, 2025
ఇవి కూడా చదవండి :
Genelia : ఆ ఒక్కటి తినడం మానేసిందట.. 37 ఏళ్ల వయసులో జెనీలియా ఫిట్నెస్ రహాస్యం ఇదే..
Tollywood: రస్నా యాడ్లో కనిపించిన ఈ చిన్నారి రాజమౌళీ సినిమాలో హీరోయిన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..?
Suriya : 100 రోజుల్లోనే సిక్స్ ప్యాక్.. 49 ఏళ్ల వయసులో కుర్రాడిలా సూర్య.. డైట్ ప్లాన్ చెప్పిన హీరో..