AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఇదెక్కడి సినిమా భయ్యా.. రూ.32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..

రూ.32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.450 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఇప్పటికీ ఓటీటీలో దూసుకుపోతుంది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలన ఈ సినిమా సంచలనం సృష్టించింది. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న సినిమా పేరెంటో తెలుసా.. ?

Cinema : ఇదెక్కడి సినిమా భయ్యా.. రూ.32 కోట్లతో తీస్తే రూ.450 కోట్ల కలెక్షన్స్.. ఇప్పుడు ఓటీటీలో ట్రెండింగ్..
Andhadhun Movie
Rajitha Chanti
|

Updated on: Feb 20, 2026 | 5:40 PM

Share

కొన్ని సినిమాలు చాలా కాలంపాటు సినీప్రియుల హృదయాల్లో నిలిచిపోతాయి. ఎలాంటి హడావిడి లేకుండా విడుదలైన చిన్న చిత్రాలు ఊహించని విజయాన్ని అందుకుంటాయి. ఇక అవే సినిమాలు అటు ఓటీటీ ప్రపంచంలోనూ సత్తా చాటుతున్నాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న మూవీ సైతం అలాంటిదే. ఈ సినిమా దాని ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే, మధ్యలో ఊహించలేని మలుపు, ఉత్కంఠభరితమైన క్లైమాక్స్ కారణంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను తెలుగులోనూ రీమేక్ చేశారు. కానీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అది ఏ సినిమానో మీకు తెలుసా? ఆ సినిమా పేరు అంధాధున్.

అంధాధున్.. ఈ చిత్రానికి బాలీవుడ్ డైరెక్టర్ శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహించారు. 2018లో థియేటర్లలో విడుదలైన ఈ మూవీలో ఆయుష్మాన్ ఖురానా, రాధికా ఆప్టే, టబు ప్రధాన పాత్రలు పోషించారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీతం అందించగా.. వయాకామ్ 18 మోషన్ పిక్చర్స్ నిర్మించింది. రూ. 32 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 450 కోట్లకు పైగా వసూలు చేసి మంచి ఆదరణ పొందింది. ఇదే చిత్రాన్ని తెలుగులో మాస్ట్రో పేరుతో రీమేక్ చేశారు. అందులో నితిన్, తమన్నా నటించారు. అయితే ఈ మూవీ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది.

హిందీలో మాత్రం ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో అత్యుత్తమ నటనకు గానూ ఆయుష్మాన్ ఖురానాకు జాతీయ అవార్డు లభించింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది.

Follow Us