OTT Movies: ఈ వారం ప్రేక్షకులకు ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి రాబోతోన్న అదిరిపోయే సినిమాలివే..

ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో కలిపి 15కు పైగా చిత్రాలు థియేటర్లు/ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వాటిల్లో గత నెల థియేటర్స్‌లో..

OTT Movies: ఈ వారం ప్రేక్షకులకు ఫుల్ మస్తీ.. ఓటీటీలోకి రాబోతోన్న అదిరిపోయే సినిమాలివే..
Ott Movies
Follow us

|

Updated on: Dec 05, 2022 | 6:13 PM

ఓ వర్గం ప్రేక్షకులు ఓటీటీల వైపు మొగ్గు చూపుతున్నారు. దానికి తగ్గట్టుగానే ప్రముఖ ఓటీటీ సంస్థలు కూడా పలు అదిరిపోయే చిత్రాలు, సూపర్ హిట్ వెబ్‌ సిరీస్‌లు స్ట్రీమింగ్ చేస్తున్నాయి. ఇదిలా ఉంటే.. ఈ వారం థియేటర్లతో పాటు ఓటీటీలో కలిపి 15కు పైగా చిత్రాలు థియేటర్లు/ఓటీటీల్లో విడుదల కానున్నాయి. వాటిల్లో గత నెల థియేటర్స్‌లో ప్రేక్షకులను అలరించిన మూడు చిత్రాలు ఈ వారం ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానున్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఊర్వశివో రాక్షసివో:

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌ జంటగా రాకేశ్ శశి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఊర్వశివో రాక్షసివో’. ఓ ట్రెడిష‌న‌ల్ అబ్బాయి, మోడ్రన్‌ అమ్మాయి మ‌ధ్య సాగే ప్రేమ‌క‌థ‌ కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఎలాంటి అంచనాలు లేకుండా నవంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ చిత్రంతో అల్లు శిరీష్ చాలా ఏళ్ల తర్వాత ఓ కమర్షియల్ హిట్ దక్కించుకున్నాడు. ఇక థియేటర్లలో ఈ సినిమా చూడని ఫ్యాన్స్ కోసం.. ‘ఊర్వశివో రాక్షసివో’ డిసెంబర్ 9వ తేదీ నుంచి రెండు ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది. అటు నెట్‌ఫ్లిక్స్.. ఇటు ఆహా ఓటీటీలో ఇది ఒకే డేట్ రిలీజ్ అవుతోంది. కాగా, ఈ రొమాంటిక్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌లో వెన్నెల కిశోర్‌, సునీల్‌, పోసాని కృష్ణమురళి, అనీష్‌ కురువిల్లా కీలక పాత్రల్లో కనిపించారు. జీఏ 2 పిక్చర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌:

సంతోష్‌ శోభన్‌, ఫరియా అబ్దుల్లా ప్రధాన పాత్రల్లో దర్శకుడు మేర్లపాక గాంధీ తెరకెక్కించిన చిత్రం ‘లైక్‌ షేర్‌ అండ్‌ సబ్‌స్క్రైబ్‌’. వీడియో షూట్ కోసం వెళ్లిన ఇద్దరు వ్లాగర్లు.. ఓ నక్సల్ దళం చేతుల్లోకి చిక్కుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగింది.? వారిద్దరూ ఎలా తప్పించుకున్నారు.? అనేది ఈ చిత్రం కథాంశం. ఈ సినిమా నవంబర్ 4వ తేదీన థియేటర్లలో రిలీజయ్యి.. సందడి చేసింది. ఇక ఇప్పుడు సరిగ్గా నెల తర్వాత ఓటీటీ వేదికపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్దమవుతోంది. ‘సోనీ లివ్‌’లో ఈ నెల 9 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది.

మాచర్ల నియోజకవర్గం:

నితిన్‌ హీరోగా దర్శకుడు రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిన చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ఇందులో కృతిశెట్టి హీరోయిన్‌గా నటించింది. మరో భామ కేథిరిన్‌ కీలక పాత్రలో కనిపించింది. పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా ఆగష్టు 12న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఇక దాదాపు నాలుగు నెలల తర్వాత ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. డిసెంబర్ 9వ తేదీ నుంచి జీ5లో ప్రసారం కానుంది.